epaper
Monday, March 2, 2026
epaper

కోల్డ్‌వార్ కంటిన్యూ..!

కోల్డ్‌వార్ కంటిన్యూ..!
పొంగులేటి, కొండా మ‌ధ్య ముదిరిన వివాదం
దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే మేడారం జాత‌ర‌ స‌మీక్ష‌కు రెఢీ
నేడు జాత‌ర ప‌నుల‌పై పొంగులేటి, సీత‌క్క ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌
టెండ‌ర్ల విష‌యంలో మంత్రుల మ‌ధ్య మొద‌లైన ర‌గ‌డ‌
పొంగులేటి పెత్త‌న‌మేంట‌ని అధిష్ఠానానికి కొండా దంప‌తుల ఫిర్యాదు
ఫిర్యాదు త‌ర్వాత కొండా ముర‌ళీపై సీఎం అస‌హ‌నం చేసిన‌ట్లుగా ప్ర‌చారం
ఈ ఘ‌ట‌న త‌ర్వాతే పొంగులేటి మేడారం ప‌ర్య‌ట‌న‌ షెడ్యూల్ ఖ‌రారు
ఆదివారం వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించినా రెవెన్యూ శాఖ మంత్రి నో కామెంట్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మేడారం టెండ‌ర్ల విష‌యంలో మంత్రులు పొంగులేటి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ‌ల మ‌ధ్య మొద‌లైన ర‌గ‌డ కంటిన్యూ అవుతోంది. వ‌రంగ‌ల్ జిల్లాపై రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి పెత్త‌న‌మేంట‌ని ప్ర‌శ్నిస్తూ.. మేడారం టెండ‌ర్ల విష‌యంలో ఆయ‌న చెప్పిందే చేశారని పేర్కొంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి కొండా దంప‌తులు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లాలో త‌న‌కు తెలియ‌కుండా దేవాదాయ శాఖ‌లో నిర్ణ‌యాలు జ‌రిగిపోతున్నాయంటూ కొండా సురేఖ అధిష్ఠానంపెద్ద‌ల‌కు పొంగులేటిపై ఫిర్యాదు చేసింది. ఈ ఆరోప‌ణ‌ల‌పై మంత్రి పొంగులేటి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న వ్య‌క్తం చేయ‌లేదు. అయితే కొండా ముర‌ళి, కొండా సురేఖ‌లు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మేడారం జాత‌ర అభివృద్ధి ప‌నుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. టెండ‌ర్ల విష‌యంలో ఇలా అధిష్ఠానం దాక ఫిర్యాదులు చేయ‌డంఏంట‌ని..? అంటూ సీఎం కొంత ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా స‌మాచారం.

నేడు సురేఖ లేకుండానేస‌మీక్ష‌..!

సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మేడారంలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈసంద‌ర్భంగా స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ మహా జాతర 2026 ఏర్పాట్ల పై ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించ‌నున్నట్లు క‌లెక్ట‌ర్ దివాక‌ర్ స్ప‌ష్టం చేశారు. అయితే ప‌ర్య‌టన షెడ్యూల్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డంతో ఆమె స‌మీక్ష‌కు దూరంగా ఉన్న‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. మేడారం టెండ‌ర్ల విష‌యంలో మంత్రుల మ‌ధ్య త‌లెత్తిన విబేధాలకు ముగింపు మార్గం క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా పొంగులేటి ప‌ర్య‌ట‌న‌లు ఎక్కువ‌గా ఉండ‌టం, ఇక్క‌డి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పొంగులేటి ప్ర‌త్య‌క్షంగా క‌లిసి మాట్లాడుతుండ‌టం, పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న దిశా నిర్దేశనం జ‌రుగుతోంద‌న్న వాద‌న‌ను కొండా వ‌ర్గం నుంచి వినిపిస్తోంది. జిల్లా మంత్రిగా కొండా సురేఖ‌కు ద‌క్కాల్సిన ప్రాధాన్యత ద‌క్క‌క‌పోవ‌డానికి ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రియే కార‌ణ‌మంటూ కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే జిల్లా ఇన్చార్జి మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగానే ఆయ‌న ప్ర‌భుత్వ గైడ్‌లైన్‌లోనే, ప్రొటోకాల్ ప్ర‌కార‌మే ప‌ర్య‌టన‌లు జ‌రుపుతున్న‌ట్లుగా కూడా కాంగ్రెస్‌లోని మిగ‌తా క్యాడ‌ర్ వాదిస్తుండ‌టం గ‌మనార్హం. జిల్లాలో రాజ‌కీయ ఆధిప‌త్య పొరే..ప్ర‌చ్చ‌న్న రాజ‌కీయ యుద్ధానికి దారితీస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నో కామెంట్‌..!

మేడారం జాత‌ర టెండ‌ర్ల విష‌యంలో పొంగులేటిపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన కొండా దంప‌తులు ఇప్పుడు ఈ విష‌యంపై బ‌హిరంగ‌గా ఎలాంటి కామెంట్లు చేయ‌డంలేదు.అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని మీడియాకు వివ‌రించేందుకు ఇష్ట ప‌డ‌టం లేదని స‌మాచారం. అదే స‌మ‌యంలో మేడారం అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌ర‌త గ‌తిన పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం చూస్తున్న త‌రుణంలో మంత్రుల వివాదం తెర‌పైకి రావ‌డంతో సీఎం అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై పొంగులేటి సైతం ఎలాంటి స్పంద‌న వ్య‌క్తం చేయ‌లేదు. న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డికి ఇటీవ‌ల మాతృ వియోగం జ‌ర‌గ‌గా…ఆదివారం పొంగులేటి ప‌రామ‌ర్శ‌కు హ‌న్మ‌కొండకు వ‌చ్చారు. హ‌న్మ‌కొండ‌లో ఉండ‌గానే మంత్రి మేడారం షెడ్యూల్ ఖరారైంది. అయితే పొంగులేటితో మీడియా మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించినా.. ఈ విష‌యంపై ఎలాంటి స్పంద‌న వ్య‌క్తం చేయ‌కుండానే వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img