epaper
Sunday, January 25, 2026
epaper

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!
విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి
ఖమ్మంలో కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన

కాకతీయ, ఖమ్మం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (మన్‌రేగా) తక్షణమే పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ (వికాస్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్) చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 43, 44, 45, 49వ డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమావేశమై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ… ప్రజలకు ఉపాధి హక్కు, పంచాయతీల పాలన హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. గ్రామపంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను నిర్వీర్యం చేస్తూ, మన్‌రేగాను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. మన్‌రేగా స్థానంలో తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది ఉపాధి హక్కును హరించే ప్రమాదకరమైన విధానమని విమర్శించారు. ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రాలపై ఆర్థిక భారం

గతంలో మన్‌రేగా పనులకు సంబంధించిన వేతనాలు 100 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చేవని, ఇప్పుడు కేంద్రం కేవలం 60 శాతం మాత్రమే భరిస్తూ మిగతా 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతోందని దీపక్ చౌదరి తెలిపారు. దీని వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి, నిధుల కొరత, వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇది గ్రామీణ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, డీ-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలగంగా తిలక్, నరాల నరేష్, పాలపు వెంకటరమణ, గుడిపూడి జగదీష్, కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కాంపటి వెంకన్న, బాణాల లక్ష్మణ్, ఎండీ ఫజల్, ఐఎన్‌టీయూసీ నాయకులు విప్లవ్ కుమార్, అనంత లక్ష్మి, ఎదునుతల ప్రభాకర్, గండం వెంకటయ్య, బోపురి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు...

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :...

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి కేంద్ర...

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి హక్కుల సాధనకు రాజకీయ బలం అవసరం మున్సిపల్...

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయ టోర్నమెంట్...

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఓటు హక్కుపై యువతలో అవగాహనే లక్ష్యం బీఎల్ఓల...

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టండి గెలుపే లక్ష్యంగా...

మధిరలో సీఎం కప్ పోటీలు

మధిరలో సీఎం కప్ పోటీలు గ్రామీణ క్లస్టర్లలో ఉత్సాహంగా క్రీడలు ఒలింపిక్ స్థాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img