స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి
– తహసీల్దార్, ఇంచార్జ్ ఎంపీడీవోకు, ఎస్ఐకి గ్రామస్తుల వినతిపత్రం
కాకతీయ, ఖానాపూర్: మండల కేంద్రం నుండి మనుబోతులగడ్డ గ్రామానికి వెళ్లే రహదారి పక్కన పెద్దమ్మగడ్డ గ్రామస్తులు ప్రధాన రహదారి పక్కనే స్మశాన వాటిక ఏర్పాటు చేయడంతో మనుబోతుల గడ్డ గ్రామానికి వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలుపుతూ స్మశాన వాటికను వేరే చోటికి మార్చాలని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు అధికారులను వేడుకొన్నారు. ఇట్టి విషయాన్ని బుధవారం నాయకులు గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ నంగునూరి రమేష్, ఇన్చార్జ్ ఎంపీడీవో సునీల్ కుమార్ రాజు, ఎస్ఐ సిహెచ్ రఘుపతిని అన్ని పార్టీల ముఖ్య నాయకులు గ్రామస్తులు కలిసి వారి సమస్యను విన్నవించుకొని అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు సొసైటీ మాజీ డైరెక్టర్ ఆబోతు అశోక్ యాదవ్, మాజీ సర్పంచ్ వల్లెపు సోమయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎస్.కె కమాలుద్దీన్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తేయావత్ బాలునాయక్, బిజెపి గ్రామ అధ్యక్షుడు ఆబోతు మహేందర్ లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం గ్రామ ముఖ్య నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రం నుండి మనుబోతులగడ్డ గ్రామానికి ప్రతి రోజు స్కూలుకు కాలేజీకి వ్యవసాయ పనుల నిమిత్తం నిమిత్తం మండలానికి వివిధ పనులపై చిన్నపిల్లలు పెద్దలు పగలు రాత్రి తేడా లేకుండా వెళ్తుంటారని మార్గమధ్యలో రహదారి వెంట స్మశాన వాటిక ఉండడం శవాలను కాలబెట్టడంతో దారి వెంట వెళ్తున్నప్పుడు అనేక సందర్భాలలో భయభ్రాంతులకు గురై అనారోగ్యం పాలైన ఆసుపత్రిలో లక్షలు ఖర్చు చేసిన సంఘటనలు గ్రామంలో చాలా ఉన్నాయని తెలుపుతూ, ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా ఉండేందుకు పెద్దమ్మగడ్డ గ్రామస్తులు ఆలోచించి రహదారి వెంట కాకుండా రహదారికి దూరంలో స్మశాన వాటికను ఏర్పాటు చేసుకుంటే మా గ్రామానికి ఆ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందని అధికారులకు నాయకులు గ్రామస్తులు విన్నవించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు ఎస్కే నాగుల్ మీరా, శివరాత్రి వెంకన్న, ఆబోతు రవికుమార్, మునుకుంట్ల యాకన్న, శివరాత్రి రమేష్, బోదాసు వెంకన్న, ఎస్.కె మైపాషా, దున్నపోతుల ఎల్లస్వామి, బానోతు శ్రీను, వల్లెపు సాయిలు, బొంత కుమార్, కుంచం వెంకన్న, భూక్య హరి, ఓర్సు సంపత్, మర్రి మహేందర్, పోతుల రాకేష్, మర్రి మధు, ఎద్దు తరుణ్, అజ్మీర మహేష్, అజ్మీర గణేష్ తదితరులు పాల్గొన్నారు.


