epaper
Thursday, January 15, 2026
epaper

అట్టుడుకుతున్న పీవోకే ..

  • మూడో రోజూ ఆగ‌ని ఆందోళ‌న‌లు
  • పాక్ బ‌ల‌గాల కాల్పుల్లో 8 మంది మృతి
  • మూతపడిన మార్కెట్లు, దుకాణాలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అట్టుడుకుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు మూడో రోజూ కొనసాగాయి. బుధవారం నిరసనల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాగ్ జిల్లా ధీరకోట్‌లో నలుగురు, ముజఫకాబాద్, మీర్‌పూర్‌లో ఇద్దరు చొప్పున పాక్ బలగాల కాల్పుల్లో మృతి చెందారు. మంగళవారం ముజఫరాబాద్‌లో మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య పదికి చేరింది. పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు కొన‌సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి. రవాణా సర్వీసులు నిలిచిపోయాయి.

38 డిమాండ్లపై లాంగ్ మార్చ్..

ముజఫరాబాద్‌లో నిరసనకారులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని, భద్రతా బలగాలు షెల్లింగ్స్‌తో విరుచుపడ్డాయని, దీంతో పలువురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని జేఏసీసీ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్ధులకు పీఓకే అసెంబ్లీలో 12 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేయడాన్ని రద్దు చేయడంతో సహా 38 డిమాండ్లపై ముజఫరాబాద్‌ ‘లాంగ్ మార్చ్’కు జేఏసీసీ పిలుపునిచ్చింది. గత 70 ఏళ్లుగా తాము ప్రాథమిక హక్కులకూ నోచుకోవడం లేదని, తమ డిమాండ్లు నెరవేర్చకుంటే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని జేఏసీసీ నేత సౌకత్ నవాజ్ మీర్ హెచ్చ‌రించారు.

భారీగా సాయుధ బలగాలు మోహ‌రింపు

కాగా, పీఓకేలోని నిరసనలను బలప్రదర్శనతో అణచివేసేందుకు ఇస్లామాబాద్ భారీగా బలగాలను దింపుతోంది. పీఓకే పట్టణాల్లో భారీగా సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నాయి. 1,000 అదనపు ట్రూప్‌లను రాజధాని ఇస్లామాబాద్‌లో మోహరించింది. గత వారంలో ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని ఒక గ్రామంపై పాక్ బాంబులతో విరుచుకుపడింది. చైనా తయారు చేసిన ఎల్-6 లేజర్ గైడెడ్ బాంబులను చైనా మేడ్ జే-17 ఫైటర్ జెట్ల నుంచి పెద్దఎత్తున జారవిడచడంతో 30మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పీఓకేలో పెద్దఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img