epaper
Sunday, March 8, 2026
epaper

పసికందును అన్యాయంగా చంపేశారు!

పసికందును అన్యాయంగా చంపేశారు!
డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ బంధువుల ఆరోప‌ణ‌
గణేష్ నర్సింగ్ హోమ్‌లో ఘ‌ట‌న‌
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉమ్మనీరు మింగ‌డంతో మృతి : డాక్టర్ బాసంతి

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తొలి కాన్పుతో ఆనందంగా ఉన్న ఓ కుటుంబాన్ని విషాదం ముంచెత్తింది. పండంటి మగబిడ్డకు జన్మనిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకం మిగిల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గణేష్ నర్సింగ్ హోమ్ మెటర్నిటీ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ రాజు తండాకు చెందిన సుస్మిత–అశోక్ కుమార్లకు ఇది తొలి కాన్పు. గర్భధారణ మొదటి నుంచే సుస్మితను కొత్తగూడెంలోని గణేష్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించి వైద్య చికిత్సలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ పరీక్షలు, స్కానింగ్‌లు చేసి పసికందు ఆరోగ్యం బాగుందని వైద్యురాలు భరోసా ఇచ్చిందని చెప్పారు.

డెలివరీ ఆలస్యం.. విషాదం

డెలివరీ తేదీగా సోమవారం నిర్ణయించడంతో ఉదయం 10 గంటలకే ఆసుపత్రికి వచ్చామని, అయినా సాయంత్రం వరకూ వేచి చూడాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు డెలివరీ చేసినప్పుడు పుట్టిన ఐదు నిమిషాలకే పసికందు మృతి చెందాడని, ఇది పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. వైద్యరంగంలో అనుభవం ఉన్న డాక్టర్ ఇలాంటి నిర్లక్ష్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మనీరు మింగ‌డంతో మృతి : డాక్టర్ బాసంతి

ఈ ఘటనపై గైనకాలజిస్ట్ డాక్టర్ బాసంతి స్పందించారు. సుస్మితను ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశామని, అప్పటికే పసికందు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపారు. పుట్టిన మగశిశువు ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్)తో పాటు మలాన్ని మింగడంతో పేగులకు అడ్డుపడి, ఊపిరితిత్తులు గట్టిగా మారి శ్వాసకోస సమస్యలు తలెత్తాయని చెప్పారు. అదే కారణంగా పసికందు మృతి చెందినట్లు వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణను తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. పసికందు మృతి తర్వాత వైద్యురాలు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చిందని, కావాలనే తమ బిడ్డను చంపేశారంటూ వారు కన్నీరు మున్నీరు అయ్యారు. తొలి కాన్పులోనే గర్భశోకం మిగిలిన ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్...

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల...

సమాజ అభివృద్ధికి మహిళలే బలం

సమాజ అభివృద్ధికి మహిళలే బలం జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా అంతర్జాతీయ మహిళా...

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా కమిటీ సభ్యులమంటూ నిరుపేదల నుంచి రూ.3...

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూ...

“మహానటి”

"మహానటి" ** ఆమె ఒక గొప్ప నటి… ఎందుకంటే ఆమె నటన ప్రాణాలతో రాసిన నాటకం ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని...

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు కాకతీయ, కొత్తగూడెం : కార్మికుల సమస్యల పరిష్కారం...

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకతీయ, కొత్తగూడెం :జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img