epaper
Thursday, January 15, 2026
epaper

పైడిపల్లిలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తత

పైడిపల్లిలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తత
ఆందోళనకారుల రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు
నలుగురు పోలీసులకు గాయాలు.. రెండు వాహనాలు ధ్వంసం

కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 17-12-2025న నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తన అనుచరులు, కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటమి ఫలితాలను అంగీకరించని ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ బ్యాలెట్ బాక్సుల తరలింపును అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సుమారు రెండు గంటల పాటు ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రిపై దాడికి యత్నించడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. అనంతరం ఆందోళనకారులు పోలీసు అధికారులపై, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో నలుగురు పోలీసు అధికారులు గాయపడగా, రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. తదనంతరం బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బందిని పటిష్ట బందోబస్తు మధ్య సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనపై రిటర్నింగ్ అధికారి (ఆర్‌.ఓ)తో పాటు పోలీసు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘనకు సంబంధించి వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ డి. రఘు చందర్ స్పష్టం చేశారు. గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img