పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత
కాకతీయ, హుజూరాబాద్ : పెద్దపాపయ్యపల్లె గ్రామంలో గురువారం జరిగిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సర్పంచ్లు మూగల రాజిరెడ్డి, భాస్కర్రెడ్డిని పంచాయతీ కార్యదర్శి నిరుత్సాహపరచడం వివాదానికి దారితీసింది.
ఎండ తీవ్రత కారణంగా టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరగా కార్యదర్శి నిరాకరించడంతో మాజీ సర్పంచ్లు మద్దతుదారులతో కలిసి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం అధికారులు స్పందించి ఏర్పాట్లు చేయడంతో సభ కొనసాగింది.
సభలో గ్రామస్తులు రహదారి హద్దులు గుర్తింపు, విద్యుత్ స్తంభాల తొలగింపు, వీధి దీపాలు, బస్ షెల్టర్, కాలువల శుభ్రత తదితర సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల రాజు, ఉపసర్పంచ్, అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


