ఇసుక రవాణా చేస్తున్న పది మంది బైండోవర్
ట్రాక్టర్లు సీజ్.. కఠిన హెచ్చరికలు జారీ
కాకతీయ, కరీంనగర్ రూరల్: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన పది మందిపై కేసులు నమోదు చేసి, వారి ట్రాక్టర్లను సీజ్ చేశారు.మానకొండూరు మండలం వెల్దీ గ్రామానికి చెందిన తాళ్లపల్లి అజయ్, తాళ్లపల్లి అనిల్, వల్లంపహాడ్ గ్రామానికి చెందిన సంకూరి అనిల్ కుమార్, సంకూరి శ్రావణ్, బొజ్జం కుమార్, సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇలియాస్, గొల్లపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ రాజశేఖర్, సైదం మహేష్, గున్నాల మల్లేష్, సెలివేరి శ్రీకాంత్పై కేసులు నమోదు చేశారు.నిందితులను కరీంనగర్ రూరల్ ఎమ్మార్వో ఎదుట బైండోవర్కు హాజరుపరిచి, ఒక్కొక్కరికి లక్ష రూపాయల పూచీకత్తు తీసుకున్నారు.ఇకపై అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే సస్పెక్ట్ షీట్లు తెరిచి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.


