సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు
తెలంగాణను గట్టిగా కాటేస్తున్న చలి
మరో రెండు రోజులు చలి తీవ్రత హెచ్చరిక
12 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. తీవ్ర చలితో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరే అవకాశముండటంతో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 26 వరకు పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
నిన్న నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ 7.8, పటాన్చెరువు 8.4, మెదక్ 8.3, రాజేంద్రనగర్ 9.5, హనుమకొండ 10.5, హయత్నగర్ 11.6, దుండిగల్ 12.0, హైదరాబాద్ 12.7, రామగుండం 12.8, నిజామాబాద్ 12.6, నల్గొండ 13.3, మహబూబ్నగర్ 14.7, ఖమ్మం 15.4, హకీంపేట 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


