epaper
Monday, March 2, 2026
epaper

విద్యావిధానంలో సమూల మార్పులతోనే పేదరిక నిర్మూలన : సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యావిధానంలో సమూల మార్పులు ప్రక్షాళన అవసరం ఉందని మా ప్రభుత్వం నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలనకు దోహదం చేయడంతో పాటు, పిల్లల భవిష్యత్తును ప్రకాశవంతం చేసేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యకు బలమైన ఆధారం అయి నిలిచినా, ఓపెన్ మార్కెట్ కారణంగా మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి సరిపోలడం లేదని వ్యాఖ్యానించారు.

ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నా, వారిలో కేవలం 15 శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గిపోతుండగా, విద్యాశాఖకు 21 వేల కోట్లు కేటాయించినా అందులో 98 శాతం జీతాలకే ఖర్చవుతోందని వివరించారు. పేదరికాన్ని నిర్మూలించే ఏకైక మార్గం విద్యే అని, అందుకే విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని సీఎం తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 73 లక్షల యువతకు మంచి భవిష్యత్తు అందించడం తమ లక్ష్యమని, కొత్త విద్యా విధానం దేశ విద్యా వ్యవస్థనే మార్చేలా ఉండాలని ఆయన అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్‌లో అనేక లోపాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని గణాంకాలను వెల్లడించారు.

విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్.ఆర్.బీ.ఎం (FRBM) పరిమితుల నుంచి మినహాయించాలని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సమూల మార్పులు రావాలని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే, దాని కోసం రాజకీయపరమైన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img