epaper
Saturday, November 15, 2025
epaper

తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు ముఖ్య అతిధిగా హాజరై, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ గారికి నివాళులు అర్పించారు. ఇదే సందర్భంలో, కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని కూడా రాజ్ నాథ్ సింగ్ గారు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, బండి సంజయ్ కుమార్ గారు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు, పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ గారు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యాంశాలు:

ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం (హైదరాబాద్ ముక్తి దివస్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడుతోంది.

1948 సెప్టెంబర్ 17న ఆర్మీ నిజాం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ట్యాంకుల ద్వారా విజయవాడ, నాగపూర్, బాంబే నుండి మూడు దిక్కులుగా వచ్చి, నిజాం రాజ్యమైనటువంటి హైదరాబాద్ సంస్థానం మీద ప్రజల రక్షణ కోసం ఆర్మీ పోరాడింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషాకరం.

భారత సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంన్నాం.

దేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో కొన్ని మహారాష్ట్రలో కలిసిపోయాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే నిజాం రాజ్యం భారతదేశంతో కలవకుండా స్వతంత్రంగా ఉండాలని నిజాం ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. పాకిస్తాన్‌తో కలవడం కోసం కూడా చర్చలు జరిపారు.

అయినప్పటికీ నిజాం ప్రైవేట్ ఆర్మీ అయిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన రజాకారులు గ్రామాల మీద దాడులు చేసి, గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు చేయడం, వేలాది మందిని హత్య చేయడం జరిగింది. హిందూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మలాడించిన ఘటన కూడా మనకు తెలిసిందే.

అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు, 13 నెలల తర్వాత, 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో భారత సైన్యం నిజాం రాజ్యమైన హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి ముందుకు వచ్చి, ఆ రోజు మనకు మూడు రంగుల జెండాను ఎగురవేశారు. ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించడం జరిగింది.

అటువంటి చరిత్ర, స్వాతంత్ర్యం వచ్చిన రోజుల గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, పాలకులు గాని ఈ తరానికి, నవతరానికి తెలియకుండా దుర్మార్గంగా తొక్కిపెట్టడం జరిగింది.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు పాఠ్యాంశాల్లో లేకపోవడం, విద్యార్థులకు కళాశాలలో చెప్పకపోవడం, బయట చెప్పకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం.

మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు, మూడు రంగుల జెండా ఎగిరిన రోజును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు అనిచివేస్తూ, చరిత్రను దాచిపెడుతున్నాయో తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలి.

నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు కర్ణాటకలో కలిశాయి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారికంగా నిర్వహిస్తోంది.

కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిసాయి. ఈ ప్రాంతంలోని జిల్లా గల తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో మహారాష్ట్రలో నిర్వహిస్తున్నాయి.

మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? హైదరాబాద్ ముక్తి దివస్ ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదు?

ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గాని, గతంలో గాని, ఇప్పుడు గాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ ముక్తి దివస్ ను అధికారికంగా నిర్వహించడం లేదు?

ఇంకా ఎందుకు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుకు పేర్లు మార్చి, ఈరోజు ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల పోరాటాన్ని, స్వాతంత్రం కోసం సమర్పించిన అనేక అమరవీరుల త్యాగాలను, ఫలితాలను, ఆకాంక్షలను అవమానం చేస్తున్నారు?

అందుకే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని బిజెపీ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, గత మూడు సంవత్సరాల క్రితం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం చేయకపోయినా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబడుతున్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదేశించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మొదటిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకున్నాం.

గత 78 సంవత్సరాలుగా హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణం ఏమిటంటే, నిజాం రాజ్యంలో కాసిం రజ్వీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీ స్థాపించబడింది. వారి ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకార్లు వందేమాతరం అని నినదించకుండా, త్రివర్ణ పతాకం ఎగరనివ్వకుండా అనేక మందిని ఊచకోత కోశారు.. అనేకమందిని హింసించారు.

అందుకే, ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ చరిత్రను, త్యాగాలను, బలిదానాలను, వాస్తవాలను కొన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నాయి.

అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నాం.

ఓట్ల కోసమే ఈ ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడుతున్నారు.

మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాం కొట్టే ఈ రాజకీయ పార్టీలకు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.

వచ్చే మూడు సంవత్సరాల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, గ్రామ గ్రామాన, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద పండుగగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తాం.

ఈరోజు విశ్వకర్మ దివస్ కూడా కావడం మరొక ప్రత్యేక సందర్భం. ఇదే రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం కూడా.

గత 11 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా పనిచేస్తున్న నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రమే.

అటువంటి నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను దేశంలో తీసుకొచ్చారు.

నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా, సమర్ధవంతమైన ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి, భారతదేశానికి సేవ చేస్తున్న నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత బలపడాలి, అభివృద్ధి చెందాలి. భారతదేశ గౌరవం మరింత పెరగాలని కోరుకుంటున్నాను.

విశ్వకర్మ జయంతి సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

1948లో భారత ఆర్మీ హైదరాబాద్ (తెలంగాణ) ప్రాంతానికి వచ్చి, నిజాం సైన్యం అయిన రజాకార్లను అణచివేయడం కోసం యుద్ధం ప్రకటించి, ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛను అందించడం జరిగింది.

ఆ సమయంలో గజేంద్ర సింగ్ షెకావత్ గారి కుటుంబ సభ్యులు కూడా ఆ ఆర్మీలో పాల్గొని పోరాటంలో భాగమయ్యారు.

నిజాంకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో, భారత సైనికుల తరఫున వారి కుటుంబ సభ్యులు కూడా పోరాడారు. ఈ సందర్భంగా వారికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చేస్తున్న సేవకు వందనం ప్రకటిస్తున్నాం.

ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి త్యాగాలు చేసిన అమరవీరులను ప్రజల ఆత్మలో తిలకించుకుని, మన సంస్కృతిని, ఐక్యతను నిలుపుకోవాలి.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ గారు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, కల్చర్ సెక్రటరీ వివేక్ అగర్వాల్ గారు, సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ అధికారులు, పోలీస్ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img