epaper
Thursday, January 15, 2026
epaper

డ్రగ్స్ నిర్మూలనలో దేశంలోనే ముందంజలో తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, ఢిల్లీ : తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులు, యువత నైపుణ్యాలు, క్రీడలు, పర్యావరణం, రవాణా రంగాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పి ఏ ఎఫ్ ఐ) 12వ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర పరిపాలనకు రాజకీయ సంకల్పం అవసరమని, భవిష్యత్ తరాల కోసం అవకాశాలు సృష్టించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం అయినా తెలంగాణకు, హైద్రాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ విజన్ డాక్యు మెంట్ – 2047 రూపొందించామని తెలిపారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి వెలుపలికి తరలిస్తున్నామని చెప్పారు. మెట్రో రైలును 70కి.మీ.ల నుంచి 150కి.మీ.లకు విస్తరించి, రోజూ ప్రయాణికులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మూసీ నదిని సబర్మతి తీరంలా అభివృద్ధి చేయాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, రీజినల్ రింగ్ రోడ్, విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అనుసంధానం వంటి ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని తెలిపారు.

పెట్టుబడిదారులను తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానిస్తూ.. మీ పెట్టు బడులకు పూర్తి భద్రత ఇస్తాం, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గర్వంగా తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రీడల్లో ప్రతిభ పెంపు కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించినట్లు చెప్పారు. 2025, డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం అని ప్రకటించారు.

బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% వాటా తెలంగాణ దేనని, వ్యాక్సిన్ తయారీలో హైద్రాబాద్ ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉందని గుర్తుచేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై వ్యాఖ్యానిస్తూ.. ట్రంప్ ఒక రోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు, మరో రోజు సుంకాలు వేస్తాడు. అలాంటి ట్రంప్ ఒకప్పుడు తెలంగాణలో కూడా ఉన్నాడు, కానీ ప్రజలు పక్కన పెట్టారు అని ఎద్దేవా చేశారు. రాత్రి వచ్చిన ఆలోచన తెల్లారే అమలు కాదు, భవిష్యత్ దృష్టితోనే తెలంగాణను తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img