epaper
Saturday, November 15, 2025
epaper

ప్రజల అస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణ‌: అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాద‌ని , ప్రజల అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కూమార్ అన్నారు. బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం లో నిర్వహించిన తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ పాల్గొని జాతీయ పతకాన్ని ఎగురవేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్ల‌డుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ నిజాం చెర నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ పోరాట యోధులు, వీరమరణం పొందిన నాయకులను ఆయన ఘనంగా నివాళులర్పించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుండి 2014లో రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన చారిత్రాత్మక ఘట్టాలను ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు.

అలాగే జిల్లాలో సంక్షేమ ఫ‌థ‌కాల గురించి మంత్రి మాట్ల‌డుతూ..మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 5.35 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశార‌ని, దీంతో రూ. 227 కోట్ల లబ్ధి పొందారని, గ్యాస్‌ సిలెండర్‌లను 500 రూపాయలకే 6.33 లక్షలు పంపిణీ చేసి, రూ.19.59 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు.

గృహజ్యోతి పథకం కింద 1.58 లక్షల సర్వీసులకు జీరో బిల్లులు జారీ చేసి రూ. 6.94 కోట్ల రూపాయలు చెల్లించార‌ని, ఇందిరమ్మ రైతు భరోసా ద్వారా 1.90 లక్షల మంది రైతులకు రూ. 206.62 కోట్ల రూపాయలు జమ చేశార‌న్నారు. రుణ మాఫీ కింద 79,541 మంది రైతులకు రూ. 622.06 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింద‌ని, రైతు బీమా కింద మరణించిన రైతు కుటుంబాలకు రూ. 25.50 కోట్ల రూపాయలు అందించడం జ‌రిగింద‌ని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,483 వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.7.48 కోట్ల రూపాయలు అందించారని, ఆరోగ్యశ్రీ కింద 15,436 మందికి 44.23 కోట్ల విలువైన ఉచిత శస్త్ర చికిత్సలు జరిగాయ‌ని, జిల్లాలో 11,575 మందికి ఇండ్లు మంజూరు కాగా, 5,844 ఇండ్ల పనులు ప్రారంభం అవ‌గా ఇప్పటివరకు రూ. 45.91 కోట్ల రూపాయలు విడుదల అయినట్లు అయ‌న తెలిపారు.

29,426 భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరిస్తూ, 233 లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చార‌ని, రబీ సీజన్‌లో 3.10 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, 58,302 మంది రైతులకు రూ. 720.85 కోట్ల రూపాయలు జమ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 39,645 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసి, జిల్లాలో 3.13 లక్షల కుటుంబాలకు నెలనెలా 5,913 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు వసతి గృహాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.

1.23 లక్షల జాబ్‌ కార్డులు జారీ చేసి, రూ.15.40 లక్షల పని దినాలు కల్పించ‌డం జరిగింద‌న్నారు.517 వ్యక్తిగత యూనిట్లకు రూ.10.16 కోట్లు, 78 గ్రూపు యూనిట్లకు రూ. 7.36 కోట్లు, 338 సంఘాలకు రూ. 54.49 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేశారని అయన తెలిపారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో అందరి సహకారం అమూల్యం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం అని అయ‌న హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా కలెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, పోలీస్ కమిష‌న‌ర్ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, ల‌క్ష్మీ కిర‌ణ్ త‌దిత‌రులు పాల్గోన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img