కాకతీయ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ -1 పరీక్షల నిర్వహణపై ఈనెల 9వ తేదీన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంజ్ స్టే విధించింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా పేపర్లను తిరిగి మూల్యాంకన చేయమని, లేదంటే తిరిగి పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. హైకోర్టు విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
719 మంది అభ్యర్థులు ఒకే విధమైన మార్కులు సాధించడం, అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం వంటి అంశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇచ్చిన వివరణను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని అప్పీల్లో పేర్కొంది. కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 14.8శాతం మంది టాప్-500లో ఉన్నారని సింగిల్ జడ్జి నిర్ణయం పేర్కొన్నప్పటికీ, దీనికి సంబంధించిన ఆధారాలు అందుబాటులో లేవని పిటిషన్ పేర్కొంది.
ఈ పిటిషన్ భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్ మట్టా , మరో 221 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చిన విధంగా దాఖలు చేసింది. డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ పై వివరణాత్మక విచారణ చేపట్టింది. అభ్యర్థుల పిటిషన్ ప్రకారం, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పీపీఎస్సీ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకపోవడం, కొలతల ఆధారాలు లేకుండా పునర్వివేచన నిర్ణయం తీసుకోవడం న్యాయ పరంగా తగదు అని వారు వాదిస్తున్నారు. అంతేకాక, ఈ వివాదం తెలంగాణ లోని ఇతర అభ్యర్థుల వంతన హక్కులను ప్రభావితం చేసే అవకాశముందని వారు పేర్కొన్నారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ వాదనలు, పిటిషన్కు సంబంధించిన వివరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ కేసు ఫలితాలు, భవిష్యత్ గ్రూప్-1 పరీక్షలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున విద్యార్ధులు, అభ్యర్థుల వర్గాల మధ్య ఇది వైజలైట్గా చర్చకు కారణమై ఉంది.
విచారణకు ముందు, అభ్యర్థులు, ప్రతివాదులు మరియు టీజీపీఎస్సీ మధ్య వివరణాత్మక న్యాయ వాదనలు వినిపించాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ మొత్తం విషయాన్ని సమీక్షించిన తర్వాత తగిన మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేసు, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపట్ల పారదర్శకత, న్యాయం, విద్యార్థుల హక్కుల రక్షణ అంశాలను ప్రభుత్వ, విద్యార్ధి వర్గాలలో చర్చకు తెచ్చింది.


