epaper
Thursday, January 15, 2026
epaper

నకిలీ వైద్యులపై కఠిన చర్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నకిలీ వైద్యులపై అధికారులు గట్టి నిఘా పెట్టి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇంతేజర్‌గంజ్, కాకతీయ యూనివర్సిటీ ఎక్స్ రోడ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఎఫ్‌ఐఆర్ నంబర్లు 357/2025, 507/2025 కింద మామిడి ఈశ్వరయ్య, సి. హెచ్. వెంకట్ రెడ్డిలపై నకిలీ వైద్యం చేస్తున్నారని ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. కాశిబుగ్గ, గోపాల్‌పూర్ ప్రాంతాల్లో వీరు ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా డాక్టర్లుగా మారి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తాజా తనిఖీల్లో ఈ నకిలీ వైద్యులు అవసరం లేని సందర్భాల్లో అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడుతూ, ప్రభుత్వ అనుమతి లేకుండా బెడ్స్ ఏర్పాటు చేసి చిన్న హాస్పిటల్స్ లాగా నడుపుతున్నట్లు బయటపడింది. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఈ చర్యలు అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. గోపాల్‌పూర్‌లో సాధుల్లా మెడికల్‌కు చెందిన అబ్దుల్ షరీఫ్ అనే వ్యక్తి కూడా నకిలీ వైద్యుడిగా బయటపడ్డాడు. అయితే ఆయన ఇకపై వైద్యం చేయనని అఫిడవిట్ ఇచ్చినందున కేసు నమోదు చేయలేదు. కానీ ఇలాంటి వారిపై విజిలెన్స్ అధికారులు తరచూ నిఘా ఉంచుతారని వెల్లడించారు.

TGMC అధికారులు స్పష్టం చేసిన విషయమేమిటంటే, RMP, PMP లకు అల్లోపతి వైద్యం చేసే అర్హత అసలు లేదని. ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ పెట్టడం, ల్యాబ్ టెస్టులు నిర్వహించడం, బెడ్స్ ఏర్పాటు చేయడం వీరి పరిధిలోకి రావని హెచ్చరించారు. అర్హత లేని వైద్యులు చేసే చికిత్సల వల్ల ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని, ఇటీవల అక్కంపల్లి గ్రామంలో మార్కండేయ అనే నకిలీ వైద్యుడు చేసిన తప్పు చికిత్స కారణంగా 25 ఏళ్ల యువకుడు మృతి చెందిన సంఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు.

పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. వి.నరేష్ కుమార్ మాట్లాడుతూ, అర్హత లేకుండా వైద్యం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం నకిలీ వైద్యులపై రూ.5 లక్షల వరకు జరిమానా మరియు కనీసం ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అర్హతలేని వ్యక్తుల దగ్గర చికిత్స చేయించుకోవద్దని, నకిలీ డాక్టర్లను గుర్తించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img