epaper
Thursday, January 15, 2026
epaper

తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, అలాగే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులు‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ లైన్ పూర్తి అయితే తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం అవుతుందని సీఎం పేర్కొన్నారు.

అదేవిధంగా, తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు అవసరమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిశ్రమల అభివృద్ధి, ఎగుమతుల పెరుగుదల సాధ్యమవుతుందని తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీజనల్ రింగ్ రైల్ అత్యవసరమని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ఇది ఏర్పడితే హైదరాబాద్ చుట్టుపక్కల రైల్వే రవాణా మరింత వేగవంతమవుతుందని చెప్పారు. భవిష్యత్‌లో అవసరమయ్యే కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలను పరిశీలించాలి అని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో రాబోయే దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వే మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మరోవైపు, శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్త రైల్వే కనెక్టివిటీ అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. ప్రస్తుతం ఉన్న లైన్‌తో పోలిస్తే కొత్త లైన్ ఏర్పడితే ప్రయాణ దూరం తగ్గుతుందని, ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వేగవంతమైన రవాణాకు దోహదం చేస్తుందని సీఎం చెప్పారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ సూచనలు, తెలంగాణ భవిష్యత్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img