epaper
Saturday, November 15, 2025
epaper

Aarogyasri: నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున బకాయిలు రావాల్సి ఉండడంతో, సమస్యల పరిష్కారం కాని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో పేదవారికి అనేక ఖరీదైన శస్త్రచికిత్సలు, ఆధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి సుమారు రూ. 1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అసోసియేషన్ చెబుతోంది. తాజాగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం రూ. 140 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అందులో రూ. 100 కోట్లు విడుదల చేయగా, మిగతా రూ. 40 కోట్లు త్వరలో ఇస్తామని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ మొత్తం బకాయి సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు వెనక్కు తగ్గలేమని చెబుతున్నాయి.

తెలంగాణలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద కుటుంబాలు ఆధునిక వైద్య సేవలు పొందుతున్నారు. ఈ పథకంలో ప్రభుత్వం 1,835 రకాల వైద్య సేవలు అందిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ, గుండె, కాలేయం, ఎముకలు, కళ్లు, అవయవ మార్పిడి, కేన్సర్, క్రిటికల్ కేర్ వంటి ఖరీదైన చికిత్సలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇటీవలే ఈ పథకంలో చికిత్స పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచింది ప్రభుత్వం. దీని వలన పేదలు ఆర్థిక భారం లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందే అవకాశం కలుగుతోంది.

ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాలనుకుంటే ముందుగా సమీప ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్రను సంప్రదించాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. అనంతరం వైద్యుడి సూచన మేరకు శస్త్రచికిత్స అవసరమైతే ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి తీసుకోవాలి. సాధారణంగా ఈ అనుమతి 24 గంటల్లో వస్తుంది. ఆపరేషన్ తర్వాత ఉచిత మందులు, భోజనం, వసతి సదుపాయాలు లభిస్తాయి. డిశ్చార్జి సమయంలో 10 రోజుల మందులు, అలాగే రవాణా ఖర్చులకు రూ.100 కూడా ఇస్తారు.

ఇక ప్రైవేటు ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తే, పేద రోగులు భారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సలు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారానే అందుతున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఆసుపత్రులకు బకాయిలు చెల్లిస్తే, మళ్లీ సేవలు సాధారణంగా పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. లేకపోతే పేదలకు కలిగే ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img