epaper
Monday, March 2, 2026
epaper

Aarogyasri: నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున బకాయిలు రావాల్సి ఉండడంతో, సమస్యల పరిష్కారం కాని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో పేదవారికి అనేక ఖరీదైన శస్త్రచికిత్సలు, ఆధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి సుమారు రూ. 1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అసోసియేషన్ చెబుతోంది. తాజాగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం రూ. 140 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అందులో రూ. 100 కోట్లు విడుదల చేయగా, మిగతా రూ. 40 కోట్లు త్వరలో ఇస్తామని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ మొత్తం బకాయి సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు వెనక్కు తగ్గలేమని చెబుతున్నాయి.

తెలంగాణలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద కుటుంబాలు ఆధునిక వైద్య సేవలు పొందుతున్నారు. ఈ పథకంలో ప్రభుత్వం 1,835 రకాల వైద్య సేవలు అందిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ, గుండె, కాలేయం, ఎముకలు, కళ్లు, అవయవ మార్పిడి, కేన్సర్, క్రిటికల్ కేర్ వంటి ఖరీదైన చికిత్సలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇటీవలే ఈ పథకంలో చికిత్స పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచింది ప్రభుత్వం. దీని వలన పేదలు ఆర్థిక భారం లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందే అవకాశం కలుగుతోంది.

ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాలనుకుంటే ముందుగా సమీప ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్రను సంప్రదించాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. అనంతరం వైద్యుడి సూచన మేరకు శస్త్రచికిత్స అవసరమైతే ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి తీసుకోవాలి. సాధారణంగా ఈ అనుమతి 24 గంటల్లో వస్తుంది. ఆపరేషన్ తర్వాత ఉచిత మందులు, భోజనం, వసతి సదుపాయాలు లభిస్తాయి. డిశ్చార్జి సమయంలో 10 రోజుల మందులు, అలాగే రవాణా ఖర్చులకు రూ.100 కూడా ఇస్తారు.

ఇక ప్రైవేటు ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తే, పేద రోగులు భారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సలు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారానే అందుతున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఆసుపత్రులకు బకాయిలు చెల్లిస్తే, మళ్లీ సేవలు సాధారణంగా పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. లేకపోతే పేదలకు కలిగే ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img