epaper
Monday, March 9, 2026
epaper

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్
ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి
రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా పనులు
మరో పది రోజుల్లో అందుబాటులోకి
జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఖమ్మం
క్రీడాకారుల్లో ఆనందం.. ఆశలు పెంపు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం త్వరలో అత్యాధునిక క్రీడా సదుపాయాలతో కొత్త రూపు దాల్చనుంది. జిల్లాలోని క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ వేదిక అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రూ.8.50 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, మరో పది రోజుల్లో ట్రాక్ పూర్తయి క్రీడాకారులకు అందుబాటులోకి రానుంది. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ సింథటిక్ ట్రాక్ పూర్తయిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు అనువైన వేదికగా మారనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.

క్రీడా సదుపాయాల దిశగా తుమ్మల అడుగులు

ఖమ్మం జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని స్టేడియాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు క్రీడాకారులకు అవసరమైన శిక్షణా వేదికలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం వల్ల క్రీడాకారులకు మెరుగైన శిక్షణా అవకాశాలు లభిస్తాయి. ఈ ట్రాక్ మన్నికైన, స్థిరమైన ఉపరితలంతో ఉండటం వల్ల అథ్లెట్లు వేగవంతమైన సమయాలను నమోదు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ ట్రాక్‌పై శిక్షణ కొనసాగించవచ్చు. సహజ మట్టి ట్రాక్‌తో పోలిస్తే సింథటిక్ ట్రాక్‌పై సాధన చేసిన అథ్లెట్లు పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మట్టి ట్రాక్‌పై సాధన చేసి సింథటిక్ ట్రాక్‌పై పోటీల్లో పాల్గొన్నప్పుడు సుమారు 1.5 నుంచి 2 సెకన్ల వరకు తేడా రావడం వల్ల పతకాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయని వారు పేర్కొంటున్నారు.

క్రీడాకారుల్లో ఆనందం

సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ వల్ల ఖమ్మం జిల్లా యువతకు అథ్లెటిక్స్‌లో మరింత ప్రోత్సాహం లభించనుంది. ఇటీవల సీఎం కప్–2024 క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్ విభాగంలో ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు 12 బంగారు పతకాలు సాధించడం విశేషం. ఈ విజయాలు జిల్లాలో అథ్లెటిక్స్‌కు ఉన్న ప్రతిభను చాటుతున్నాయి. ఇప్పుడు సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లాలో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు పెరుగుతాయని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఖమ్మం నగరంలో ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు క్రీడాభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..! పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం బాధితుల బాధను రాజకీయ...

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు...

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ,...

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా కీలకం అర్హులైన బాలికలను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img