కాకతీయ, నెల్లికుదురు : గత వారం రోజులుగా కురవిలో మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్స్ బాలుర క్యాంపులో మంగళవారం జరిగిన ఫైనల్ సెలక్షన్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండలంలోని ఆలేరు విద్యార్థులు బానోతు సాయి చరణ్, ఎండి సమీర్,ఎల్. నవదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుండి 28 వరకు నిజాంబాద్ జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సంద వీరన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మద్ది వెంకటరెడ్డి జాయింట్ సెక్రటరీలు చాంప్లా నాయక్, రాసమల్ల అనిల్ పాల్గొన్నారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ ఇమామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ రాందాస్ ని గ్రామస్తులు, ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు అభినందించారు.


