స్ట్రాంగ్ రూం.. కౌంటింగ్ హాల్ పరిశీలన
కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ ఎన్నికల సందర్బంగా పట్టణంలోని సింగరేణి క్లబ్లో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ లను శనివారం మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. సీసీ కెమెరాల సహాయంతో ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. క్లబ్ అనుకోని వంద మీటర్ల వరకు ఆంక్షలు ఉన్నాయన్నారు. ఇప్పటికే సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని సూచించారు. డీసీపీతోపాటు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ రమేష్, ఆర్కేపీ ఎస్సై శ్రీధర్, మున్సిపల్ ఏఈ ఆశ్రిత్, అవినాష్, శ్రీనివాస్ ఉన్నారు


