epaper
Wednesday, April 1, 2026
epaper

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం
ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి
పథకాల వివరాలు ప్రజలకు చేరవేయాలి
లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలి
ప్రజా ప్రతినిధుల హాజరు తప్పనిసరి
సభల ద్వారా అవగాహన పెంచాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక అమలుకు గ్రామ సభలే వేదిక అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు చేరేలా గ్రామ, వార్డు సభలను సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న సభలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులు, వాటి వినియోగంపై వివరాలు తెలియజేయాలని సూచించారు. జీవన బీమా పథకం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి పథకాల వివరాలను ప్రజలకు చెప్పాలని అన్నారు.

లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడాలి

రైతు భరోసా, ఉచిత విద్యుత్, వ్యవసాయ బోర్లు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. గ్రామ సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని చదవాలని తెలిపారు. అనంతరం పథకాల వివరాలను వినిపించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ గ్రామ, వార్డు సభల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులతో సమావేశమై గ్రామ, వార్డు సభల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, జడ్పీ సీఈఓ శేషాద్రి, డీపీవో లక్ష్మీ రమాకాంత్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతః రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

అంతః రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ ఒంటరి మహిళలే లక్ష్యంగా ముఠా...

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ రెడ్డి బోనాలు, ప్రతిష్ఠతో కోనాపురం...

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. *863 మంది భూనిర్వాసితులకు ఇంటి...

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో

ఆగి ఉన్న లారీకి ఢీకొట్టిన ఆటో ముగ్గురికి గాయాలు కాకతీయ, గీసుగొండ : రోడ్డుపై...

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్

మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్ టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్ కాకతీయ, పెద్దవంగర...

మక్కలు మక్కిపోతున్నాయి

మక్కలు మక్కిపోతున్నాయి - ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రం - అమ్ముకునే వీలు...

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత కాకతీయ, పెద్దవంగర :ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను...

ఎంపీడీవో కు బిజెపి వినతి

ఎంపీడీవో కు బిజెపి వినతి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి గ్రామ పంచాయితీ మరియు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img