స్టెమ్ సెంటర్ ప్రారంభం
గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ
జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాసరావు
కాకతీయ, బోనకల్ : గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు స్టెమ్ సెంటర్ ప్రారంభించడం ముఖ్యమని సర్పంచ్ మందా కరుణ అన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా నిజమైన విజ్ఞానం సాధ్యమని జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని గోవిందాపురం ఎల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో స్టెమ్ సెంటర్ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మందా కరుణ, జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాసరావు, ఎంఈఓ దామల పుల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రచ్చ శ్రీనివాసరావు మాట్లాడారు. పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విద్య అవసరమని అన్నారు. స్టెమ్ సెంటర్ గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును మార్చే శక్తి కలిగిస్తుందని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన మానవ శరీర నిర్మాణం, వ్యవసాయ పరికరాలు, సైన్స్ ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఆవిష్కరణలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ ఉమా శంకర్ పాల్గొన్నారు. క్రై సంస్థ ప్రతినిధులు విజయ్ కుమార్, సురేష్, రేణుక, కార్తీక్ హాజరయ్యారు. ముత్తారపు కరుణ, జొన్నలగడ్డ సునీత, అరుణ, నరసమ్మ, గురవమ్మ, రాణి, లాల్ బి, ఉష, మౌనిక మరియు గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


