శ్రీరామనవమి కళ్యాణ గోడపత్రిక ఆవిష్కరణ
కాకతీయ, కారేపల్లి : శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకులు రవీందర్ సురేష్ స్వామీజీలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. కొత్తూరుతండాలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 27వ తేదీ ఉదయం ధ్వజారోహణ, భోగి బండారో, మధ్యాహ్నం 12:05 గంటలకు సీతారాముల కళ్యాణం, అనంతరం అన్నదానం, సాయంత్రం చక్రస్థానం, ధ్వజావరోహణ, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నమడం పల్లి సర్పంచ్ భానోత్ పద్మరూప్ల నాయక్, ఉపసర్పంచ్ స్వర్ణలత, ధరావత్ రాజునాయక్, బానోత్ లక్ష్మానాయక్, బానోద్ భాషా, జరపలా నెహ్రు, సపవట్ రవీందర్, మెట్ల అరవింద్, భానోత్ వీరభద్రు, ఇస్లావత్ యువరాజు, ధరావత్ ఉపేందర్, పండగ మురళీధర్, బానోత్ హేమంత్, సపవట్ భధ్య, ధరావత్ నాగేశ్వరరావు, లకావత్ లక్ష్మ తదితరులు పాల్గొన్నారు.


