కాకతీయ, గీసుగొండ: సుప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధానార్చకులు సముద్రాల సుధర్శనా చార్యులు స్వామి వారికి వైదిక మంత్రోచ్ఛరణలతో అభిషేకం, పూజలు నిర్వహించి, మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మండల దీక్షలు చేపట్టిన స్వాములు శరణు సుబ్రహ్మణ్య స్వామీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్ను ఫాలోకండి


