వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కౌన్సిలర్లతో కలిసి పర్యటించిన చైర్ పర్సన్ లక్ష్మీరామానంద్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యంపై చర్యలు
కాకతీయ, నర్సంపేట : నర్సంపేట పట్టణ అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. బుధవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో మరియు పదమూడో వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు ఇస్లావత్ రామ గోపి, భూక్య మాత్రు నాయక్లతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా కూడా పాల్గొన్నారు. వార్డుల్లో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని చైర్ పర్సన్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
వార్డుల్లో అవసరమైన చోట సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం చేపట్టడంతో పాటు తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను అధికారులు వెంటనే గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వార్డుల ప్రజలు చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ పున్నం నరసింహారెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీను, వార్డు ఆఫీసర్ అశోక్, హర్షవర్ధన్, యాకూబ్, రహీం పాషా, సీనియర్ నాయకుడు మిడిమాలపు దామోదర్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, కాంగ్రెస్ నాయకులు పొన్నం సంతోష్, గుళ్ళ ప్రదీప్, ఆకుల నాగరాజు, భూస నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


