epaper
Sunday, March 1, 2026
epaper

మేం పార్టీ మార‌లేదు అధ్య‌క్షా..!

*మేం పార్టీ మార‌లేదు అధ్య‌క్షా..!

*బీఆర్ ఎస్‌లోనే కొన‌సాగుతున్నాం

*పార్టీకి వ్య‌తిరేకంగా ఎక్క‌డా మాట్లాడ‌లేదు

*అభివృద్ధి ప‌నుల కోస‌మే సీఎంను క‌లిశాం

*మాకు కండువాలు క‌ప్ప‌లేదు.. క‌ప్పిన కండువాలు కాంగ్రెస్‌వి కానేకావు

*పార్టీ ఫిరాయింపు నోటీసుల‌పై అసెంబ్లీ స్పీక‌ర్‌కు 8మంది ఎమ్మెల్యేల వివ‌ర‌ణ‌

*మాకు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని స్పీక‌ర్‌ను కోరిన‌ క‌డియం, దానం

*8మంది ఎమ్మెల్యేల వివ‌ర‌ణ‌ల‌ను బీఆర్ ఎస్ కార్యాల‌యానికి పంపిన స్పీక‌ర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 8మంది ఎమ్మెల్యేలు స్పీక‌ర్ నోటీసుల‌కు స్పందించారు. అస‌లు తాము పార్టీయే మార‌లేద‌ని, బీఆర్ ఎస్‌లోనే కొన‌సాగుతున్నామ‌ని స్పీక‌ర్ జారీ చేసిన నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే తాము సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశామ‌ని, పార్టీలో చేరిన‌ట్లుగా ఎక్క‌డా ప్ర‌క‌టించుకోలేదని, బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు కూడా ఎక్క‌డా చేయ‌లేద‌ని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సమాధానాలను ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యానికి స్పీక‌ర్ కార్యాల‌య అధికారులు పంపించారు. సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా వీరి పైన నిర్ణయం తీసుకోవాలని సూచించటంతో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వివ‌ర‌ణ ఇచ్చిన నేప‌థ్యంలో త‌ర్వాత బీఆర్ ఎస్ స్పంద‌న‌, స్పీక‌ర్ చ‌ర్య‌లు ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మాకు మ‌రి కొంత స‌మ‌యం కావాలి : క‌డియం, దానం

పార్టీ ఫిరాయింపుల ఆరోప‌ణ‌ల నోటీసుల జారీపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు త‌మ‌కు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్‌ను స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌లు కోరినట్లు సమాచారం. తాము ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని..బీఆర్​ఎస్​కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు లీగల్‌ జడ్జిమెంట్లను కుడా వివ‌ర‌ణ‌ల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తాము పార్టీ మారిన‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎంత‌మాత్రం నిజం లేద‌ని, బీఆర్​ఎస్​ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ట్ల తెలుస్తోంది.

ఎన్నిక‌లైకైనా సిద్ధ‌మే..!: దానం, కడియం ఆలోచ‌న ఇదే..

పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని.. పార్టీ మారలేదని స్పీకర్‌కు సమాధానం ఇచ్చారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని అడిగారు. వీరిద్దరూ తాము ఉపఎన్నికలకు అయినా సిద్ధం కానీ బీఆర్ఎస్‌లో ఉన్నట్లుగా చెప్పుకోవడానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని స‌మాచారం. వాస్త‌వానికి గత ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వీరందరితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయనిపుణులు సూచనలు అన్నింటిపై చర్చించాకా టెక్నికల్ అంశాల ఆధారంగానే స్పీక‌ర్ వేటు నుంచి త‌ప్పించుకోవ‌డం త‌ప్పా మ‌రో మార్గం లేద‌ని సూచిన‌ట్లుగా తెలుస్తోంది. ఈమేర‌కే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే కొన‌సాగుతున్నామ‌ని స్పీక‌ర్‌కు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే క‌డియం, దానం నాగేంద‌ర్‌లు మాత్రం అలా చేయ‌డానికి అయిష్టంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అవ‌స‌ర‌మైతే ప‌దవుల‌కు రాజీనామా చేసి మ‌ళ్లీ ఎల‌క్ష‌న్ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ప‌రిణామాల‌ను బ‌ట్టి నిర్ణ‌యాల‌ను తీసుకునే విధంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం అనే వ్యూహాత్మ‌క వైఖ‌రితో స్పీక‌ర్‌ను మ‌రింత స‌మ‌యం కోరిన‌ట్లుగా విశ్లేష‌ణ జ‌రుగుతోంది.

అన‌ర్హ‌త పిటిష‌న్ల తిర‌స్క‌రణే..?!

ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన‌ట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ టెర్మ్స్ ప్రకారం వారెవరూ పార్టీ మారలేద‌నే వాద‌న న్యాయ‌నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ మారినట్లుగా ఆధారాలు చూప‌డం బీఆర్ ఎస్‌కు సుల‌భ‌త‌ర‌మే. ఇక క‌డియం విష‌యానికి వ‌స్తే కడియం కూడా తాను పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది.. కానీ త‌న‌కున్న పొలిటిక‌ల్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకునే బీఆర్ ఎస్‌లోనే ఉన్న‌ట్లుగా చెప్పుకోవ‌డానికి ఇష్టం ప‌డటం లేద‌ని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఎనిమిది మందిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడం ఖాయం. మరి ఇద్దరి సంగతిని ఏం చేస్తార‌న్న‌ది మాత్రం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img