సమస్యలు పరిష్కరించండి
కాకతీయ, మేడ్చల్ మల్కాజ్గిరి: జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్కు తాళ్ళబస్తి హనుమాన్ ఆలయం వద్ద బోర్ సమస్యతో పాటు బీజేఆర్ నగర్, సత్తిరెడ్డి కాలనీ, పీవీఎన్ కాలనీ, సత్య రాఘవేంద్ర కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో దోమల సమస్యపై వినతిపత్రం అందజేశారు. రెండు నెలలుగా ఫాగింగ్ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ కల్పించాలని బీజేఆర్ నగర్, శ్రీనగర్, తాళ్ళబస్తి, కస్తూరిబా కాలనీ, తిరుమల నగర్ వాసులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సమస్యలపై జెడ్సీ సానుకూలంగా స్పందించారు.


