epaper
Thursday, January 15, 2026
epaper

గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి

గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా
హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు : జి. నాగయ్య హెచ్చరిక

కాకతీయ, ఖిలావరంగల్ : జక్కలొద్దీ రామ సురేందర్ నగర్ గుడిసె వాసులందరికీ తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, లేదంటే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించాలని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి. నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఖిలా వరంగల్ సీపీఎం కార్యదర్శి నలిగంటి రత్నమాల అధ్యక్షత వహించగా, కామ్రేడ్ రామసందీప్ తదితరులు దీక్షలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కామ్రేడ్ జి. నాగయ్య మాట్లాడుతూ… ప్రభుత్వాలు మారుతున్నా పేదల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని విమర్శించారు. నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా గుడిసెల్లోనే నివసిస్తూ వర్షాలు, ఎండలు, విషజంతువుల భయం మధ్య గడుపుతున్న పేద కుటుంబాలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలు కూడా ఇప్పటివరకు అమలుకాలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు గానీ, ఇళ్ల పట్టాలు గానీ గుడిసె వాసులకు అందలేదన్నారు. పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేరళలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉదాహరణగా పేర్కొంటూ, తెలంగాణలో కూడా అదే తరహాలో పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి రత్నమాల మాట్లాడుతూ… గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గుడిసె వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img