వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం..
ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
భక్తులతో పోటెత్తిన పుణ్యక్షేత్రం
రామ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
కాకతీయ,రాయపర్తి /పాలకుర్తి :వాల్మీకి మహర్షి తపస్సు చేసిన పుణ్యభూమిగా పేరుగాంచిన పాలకుర్తి మండలంలోని వల్మిడి గుట్టపై వెలసిన సీతారామ లక్ష్మణుల ఆలయ పుణ్యక్షేత్రం పులకించిపోయింది.శుక్రవారం శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని సీతారాముల కళ్యాణోత్సవం కనులపండువగా జరిగింది.ఈ నేపథ్యంలోఎమ్మెల్యే యశస్విని రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యాక్షరాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణలతో కళ్యాణ ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది.రామయ్య కళ్యాణాన్ని కళ్ళారా తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.పాలకుర్తితో పాటు చుట్టుపక్కల మండలాల నుండి వచ్చిన భక్తులతో వల్మిడి క్షేత్రం జనసంద్రంగా మారింది.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఆలయ ప్రాంగణమంతా భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమ్రోగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు,పాడి పంటలు సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నమ్మన్నారు.వల్మిడి క్షేత్రాన్ని రాష్ట్రంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక,పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఆలయాల అభివృద్ధి,భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.వల్మిడి గిరిధామం వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు.



