epaper
Monday, March 2, 2026
epaper

ఘనంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు

ఘనంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు…

పట్టు వస్త్రాలు సమర్పించిన

మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కాకతీయ, సిరిసిల్ల టౌన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌,ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… వేములవాడ ఆలయం రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయమని పేర్కొన్నారు.గతంలో ఆలయ అభివృద్ధి కోసం పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు, స్థానిక శాసన సభ్యుల చొరవతో ఆలయ అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు.వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల దేవుడిగా భావించే వేములవాడ రాజన్న ఆలయం, అలాగే సమ్మక్క సారలమ్మ ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.

వేములవాడ రాజన్న ఆలయాన్ని సుమారు రూ.150 కోట్ల వ్యయంతో 4 ఎకరాల విస్తీర్ణంలో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు. రాజన్న ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ పరమశివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పారదర్శక, ప్రజాకేంద్రీకృత పరిపాలన అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజా పాలన మరింత బలపడాలని రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు.మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం, జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img