epaper
Monday, November 17, 2025
epaper

షేక్‌ హసీనాకు మ‌ర‌ణ‌శిక్ష‌

షేక్‌ హసీనాకు మ‌ర‌ణ‌శిక్ష‌

ఢాకా కోర్టు సంచ‌ల‌న తీర్పు

ఆమె తీరు మానవత్వానికి మచ్చ అంటూ ఆగ్ర‌హం

అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చారన్న కోర్టు

ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానికి శిక్ష ఖరారు

విద్యార్థుల ఆందోళనలతో వ‌దులుకున్న ప్రధాని పీఠం

ప్రస్తుతం భారత్‌లో హసీనా ఆశ్రయం

ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివాసం

తీర్పు నేప‌థ్యంలో ఢాకాలో హైఅలర్ట్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించింది. ఆమెపై దాఖలైన హత్యానేరం కేసుల్లో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో బంగ్లాదేశ్‌ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా మరణ శిక్ష విధించిన ప్రత్యేత ట్రైబ్యునల్‌, అప్పటి పోలీస్‌ చీఫ్‌ చౌధురి అబ్దుల్లాకు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. మానవత్వం లేకుండా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సో మవారం ఆమెను దోషిగా తేల్చింది. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ..

గత ఏడాది జులై-ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా ఢాకాలో విద్యార్థుల చేపట్టిన ఆందోళనల సమయంలో వారిని చంపేయమని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించేలా షేక్ హసీనా పోలీసులు, సైన్యాన్ని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని తెలిపారు. షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని కోరారు.
దిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివాసం

విద్యార్థుల ఆందోళనలతో..

విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటినుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తూ, అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేసిన ఆమె, ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు. “నేను బతికే ఉన్నాను. ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి. నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. అప్పటివరకు నా ప్రజల కోసం పనిచేస్తాను. ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నాను. వారు నా ఇంటిని కాల్చివేశారు. గోనో భవన్‌ (బంగ్లా ప్రధానమంత్రి అధికారిక నివాసం) నా ఆస్తి కాదు. అది ప్రభుత్వానిది. నేను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగింది. అది విప్లవం అని వారు చెప్తున్నారు. గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరు.” అని హసీనా మండిపడ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవు గ‌తంలో డిపాజిట్లు...

పైర‌సీతో రూ.20 కోట్లు..

పైర‌సీతో రూ.20 కోట్లు.. ఇమ్మ‌డి ర‌వి హార్డ్​ డిస్క్​లో 21 వేల సినిమాలు నిందితుడి...

కోర్టు ధిక్కారమే..

కోర్టు ధిక్కారమే.. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? లేదంటే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం...

సీజేఐపై దాడి ..

సీజేఐపై దాడి .. 30 కోట్ల దళితులపై దాడే.. దాడులకు పాల్పడే వారిని వ‌దిలిపెట్టం ఆత్మగౌరవాన్ని...

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..!

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..! డిసెంబ‌ర్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ కేబినేట్‌ కాక‌తీయ‌,...

గుజ‌రాత్‌లో వ‌ధువును హ‌త్య చేసిన వ‌రుడు

గుజ‌రాత్‌లో వ‌ధువును హ‌త్య చేసిన వ‌రుడు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : పెళ్లికి...

రంగారెడ్డి జిల్లాలో దారుణం..

తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని అన్న‌పై ప‌గ‌ కిరాత‌కంగా చంపించిన అమ్మాయి తండ్రి ఎల్లంపల్లిలో...

ఐ బొమ్మ క్లోజ్‌

ఐ బొమ్మ క్లోజ్  బప్పం టీవీ వెబ్​సైట్లూ మూసివేత సినీ ప్ర‌ముఖుల‌ను బెదిరించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img