epaper
Saturday, November 15, 2025
epaper

నేల‌రాలిన ఆశ‌లు

  • ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం
  • తుఫాన్‌ ప్రభావంతో చేతికొచ్చిన పంట నీటిపాలు
  • వేల ఎక‌రాల్లో దెబ్బ‌తిన్న వరి, పత్తి ..
  • కొనుగోలు కేంద్రాల్లో త‌డిసిమ‌ద్దైన వ‌రిధాన్యం
  • ప్రకృతి కన్నెర్రతో కన్నీరు మున్నీరవుతున్న రైతులు
  • ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వానికి వేడుకోలు
  • 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా..
  • న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతును ఆదుకుంటామ‌ని మంత్రి తుమ్మ‌ల భ‌రోసా
  • ఎకరాకు రూ. 10వేల చొప్పున ప‌రిహారం అందిస్తామని ప్ర‌క‌ట‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం అయింది. చేతికొచ్చిన పంట తుఫాన్ వల్ల నేల రాలింది. తుఫాన్‌ వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వస్తున్నాయి. కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడం, దగ్గరపోయడం రైతులకు స‌వాల్‌గా మారింది. మోంథా తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్, మెద‌క్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లోని రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వానలకు ముఖ్యంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది. వేల ఎక‌రాల్లో వరి, పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. చేతికొచ్చిన పంట నీట మునగడం, క‌ళ్ల‌ముందే ధాన్యం నీటిపాల‌వ‌డంతో అన్న‌దాత‌లు గుండెలు బాదుకుంటున్నారు. ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు.

నేలకొరిగిన పంట చేన్లు

తుఫాన్‌ ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా వరి పంట కోత సమయంలో నేలరాలడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వరి కోయడానికి తడిగా ఉండటంతో మిషన్లతో కోయడానికి వీలు కావడంలేదు. చైన్‌ మిషన్ల ద్వారా రైతులు వరికోతలు కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కోపించిన పచ్చి ధాన్యాన్ని ఆరబెట్టడంలో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ధాన్యం పచ్చిగా ఉండడంతో మొలకలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరకక సాగు ఇబ్బంది అయింద‌ని.. ఇప్పుడేమో చేతికి వచ్చిన పంట అమ్ముకుందామంటే ప్రకృతి కన్నెర్ర జేయబట్టే అని కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆదుకుంటాం : తుమ్మ‌ల‌

తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10వేల చొప్పున అందిస్తామన్నారు. 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశు సంపద, ఇల్లు నష్టపోయినా ఆదుకుంటామని చెప్పారు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తార‌ని, నష్టపోయిన ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తార‌ని తెలిపారు. మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆదేశించారు. 11 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటాం. కేంద్రం సహకరించకపోయినా ప్రతి రైతుకు అండగా నిలుస్తాం. గత ఏడాది వరదల్లోనూ భారీగా నష్టం జరిగినా కేంద్రం సాయం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించినా స్పందించలేదు అని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img