కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు పాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే కేఏపాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పనిచేస్తున్న యువతి ఆయనపై ఫిర్యాదు చేసింది.
విధి నిర్వహణలో ఉన్న తనను కేఏ పాల్ లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు పేర్కొంది. దీనికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లను పోలీసులకు అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా పంజాగుట్ట పోలీసులు తెలిపారు.


