epaper
Sunday, March 1, 2026
epaper

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు.. నిందితుడు పదవ తరగతి విద్యార్థి..?

కాకతీయ, క్రైమ్ బ్యూరో: కూకట్ పల్లి సంగీత్ నగర్ లో 10ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనక మిస్టరీ వీడింది. పదో తరగతి విద్యార్థి బాలికను హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీకోసం వెళ్లి బాలిక ఉండటంతో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్ రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు రాసుకున్న పేపర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెబుతామని కూకట్ పల్లి పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన క్రిష్ణ, రేణుక దంపతులు ఐదు సంవత్సరాలుగా కూకట్ పల్లి సంగీత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. క్రిష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్నాడు. రేణుకా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. వీరికి కుమార్తె సహస్ర, కుమారుడు ఉన్నారు. సహస్ర బోయిన్ పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటికి సమీపంలోని పాఠశాలకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లారు. వారి కుమారుడు స్కూల్ కు వెళ్లాడు. క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఇంట్లో ఉంది.

తాను స్కూల్ కు వెళ్ళి తమ్ముడికి లంచ్ బాక్సు ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేసి పెట్టారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో లంచ్ బాక్స్ తీసుకురాలేదంటూ స్కూల్ సిబ్బంది క్రిష్ణకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచాడు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించడంతో భయంతో కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక శరీరంలో 20 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మెడపైనే 10 ఉన్నాయి. పోస్టు మార్టం ప్రాథమికనివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు ఆధారాలను సేకరించారు. జాగిలం ఘటనాస్థలం నుంచి నేరుగా కిందికి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలో సీసీ కెమెరాలను సేకరించి ఐదు రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img