నాణ్యత లేని టీ పౌడర్ సీజ్
మార్టులో గుర్తించిన ఫుడ్ సేఫ్టీ, పోలీస్అధికారులు
కాకతీయ,ఆత్మకూరు : కిరాణాషాలుల్లో నకిలీ సరుకులు పంపిణి చేస్తే కేసులు నమోదు చేస్తామని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని గుండెప్పాడు సెంటర్లో నకిలీ టీ పౌడర్ ను అమ్మకలు చేస్తున్న ఎం.ఎం మార్ట్ లో ఫుడ్సేఫ్టీ,పోలీస్ అధికారులు తనిఖీ చేసి నకిలీ టీ పౌడర్ ను గుర్తించారు.అనంతరం ఎస్సై మాట్లాడుతూ కిరణం & జనరల్ లలో నాణ్యత లేని సరుకులను అమ్మకాలు చేస్తే సాహించేది లేదని తెలిపారు.ఎం ఎం మార్ట్ లో దాదాపు 40 కిలోల నకిలీ టీ పొడిని పట్టుకున్నామని తెలిపారు.అనంతరం ఫుడ్ సేఫ్ట్ అధికారులు నకిలీ వస్తువులను ఎలా గుర్తించలో డెమో చూపించారు.ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణ మూర్తి,
పరకాల రూరల్ సీ.ఐ. రంజిత్ రావు, దామెర ఎస్సై కొంక అశోక్ పాల్గొన్నారు…


