epaper
Thursday, April 9, 2026
epaper

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!
ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..?
తప్పుడు కేసులతో వేధింపులు.. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నేతల ఆగ్ర‌హం

కాకతీయ, ఖమ్మం బ్యూరో : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పోటు రంగారావుపై కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఐఏ నమోదు చేసిన దేశద్రోహం, ఇతర కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మంలో రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర కమిటీ నాయకులు కేజీ రామచందర్, కే రమ, కే రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అణచివేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కేసులను బనాయిస్తోందని వారు ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.

ప్రజా ఉద్యమాలను అణచివేత ప్రయత్నమా..?

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చట్టబద్ధంగా బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతోందని, అలాంటి పార్టీపై కుట్ర కేసులు నమోదు చేయడం అన్యాయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలను చైతన్య పరుస్తున్నందుకే పాలకవర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా, ఉమర్ ఖలీదు వంటి పలువురిపై కూడా ఇలాంటి కేసులు పెట్టి తర్వాత ఉపసంహరించుకున్న ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలి

పోటు రంగారావు దాదాపు యాభై ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని, అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వారిని అణచివేయాలనే ప్రయత్నంగా ఈ కేసులను చూస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశద్రోహం, ఇతర కేసులను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఈ ప్రెస్ మీట్ లో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే సూర్యం ఎస్ఎల్ పద్మ, సదానందం ఎం కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులుగుర్రం అచ్చయ్య, సీ వై పుల్లయ్య, ఆవుల అశోక్, జిరామయ్య, పార్టీ జిల్లా నాయకులు మలీదు నాగేశ్వరరావు, కమ్మ కోమటి నాగేశ్వరరావు,టి ఝాన్సీ, ఎన్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్ నిర్వ‌హ‌ణ‌లేని గ్రామ డంపింగ్ యార్డ్ కాకతీయ, ఏన్కూర్ :...

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కాకతీయ ఖమ్మం టౌన్ :...

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి పోనేక‌ల్లులో అత్యాధునిక వసతులతో భ‌వ‌న నిర్మాణాలు చదువు తో...

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల నాణ్యతపై సమగ్ర పరిశీలన క్వాలిటీ...

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ ఈనెల 25న మేడ్చల్‌లో సభ.....

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు ఎమ్మెల్యే చొరవతో...

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి 36...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి 26 క్వింటాళ్ల నిబంధన రద్దు చేయాలి సీపీఐ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img