epaper
Wednesday, March 4, 2026
epaper

టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలి

టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

కాకతీయ, వరంగల్ సిటీ : టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం పట్టణ పరిధిలోని బోడగుట్ట, సోమిడి వడ్డేపల్లి, లష్కర్ సింగారం, పెద్దమ్మ గడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, హసన్ పర్తి, కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,98,000 ప్రభావిత గ్రూపులకు చెందిన వారిని పరీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించవలసి ఉండగా 1,30,049 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగిందనీ, స్క్రీనింగ్ తక్కువగా నిర్వహించిన వడ్డేపల్లి, లష్కర్ సింగారం, కడిపికొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులను ఇందుకు గల కారణాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దేశంలో టీబీ నిర్మూలన లక్ష్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో టీబీ నియంత్రణ కార్యక్రమాలకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా స్క్రీనింగ్, ఎక్స్ రే, నాట్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన మొబైల్ ఎక్స్ రే మిషన్ ను పరిశీలించి ప్రణాళిక ప్రకారం ఎక్కడైతే ఎక్స్ రే పరీక్షలు తక్కువగా నిర్వహించారో అక్కడి ప్రజలకు అవగాహన కల్పించి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ బాగానే చేస్తున్నప్పటికీ పట్టణ పరిధిలో మాత్రం చాలా తక్కువగా ఉందని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బంది, వనరులతో టిబి ముక్త్ భారత్, ఎన్సిడి, మాతా శిశు సంక్షేమంతో పాటు ఇతర అన్ని ఆరోగ్య కార్యక్రమాలు లక్ష్యాలను సాధించాలని, లేనట్లయితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య టీబీ ముక్త్ భారత్, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్న ఆరోగ్య కేంద్రాల ఏఎన్ఎంలు, ఆశాలవారీగా సమీక్షించి కారణాలను తెలుసుకొని వాటిని అధిగమించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.100 శాతం ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగడానికి ప్రోత్సహించిన ఆరుగురు ఆశాలను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, పీవోడిటి డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ జ్ఞానేశ్వర్, డెమో వి.అశోక్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరలో ప్రభల హోరు..

కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాత‌ర‌లో రాజకీయ ఆధిప‌త్య‌ రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర...

పోడు భూములకు పట్టాలివ్వాలి

పోడు భూములకు పట్టాలివ్వాలి తుడుం దెబ్బ డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : పోడు భూములకు...

డ్రైవర్ల పోరాటానికి ఫలితం

డ్రైవర్ల పోరాటానికి ఫలితం జీతభత్యాలపై చ‌ర్చ‌లు స‌ఫ‌లం నూతన వేతనాల ఒప్పందం ఖరారు కాకతీయ, నర్సంపేట...

నాగలక్ష్మి ఆలయంలో చోరీ

నాగలక్ష్మి ఆలయంలో చోరీ విగ్ర‌హాలు విలువైన సామాగ్రి అప‌హ‌ర‌ణ‌ ఆకులవారి ఘనపురంలో ఘ‌ట‌న‌ గ్రామంలో...

అడవులను ర‌క్షించాలి

అడవులను ర‌క్షించాలి వ‌న్య‌ప్రాణులను కాపాడుకోవాలి ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు...

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం వాగులో విష్ణుమూర్తి పొలిక‌ల‌తో ఉన్న విగ్ర‌హం ల‌భ్యం వేల ఏళ్ల...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం..

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం.. స్వామివారికి హోలీ ప్రత్యేక పూజలు.. కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img