epaper
Saturday, November 15, 2025
epaper

రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎ. విజయ్ భాస్కర్

కాకతీయ, గీసుకొండ : అధిక వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. మండలంలోని పోతరాజుపల్లి, మాచాపూర్, గీసుకొండ, గంగదేవిపల్లి గ్రామాల్లో పత్తి, వరి, సోయా, పసుపు, కూరగాయ పంటలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల బృందం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త డా. ఎ. విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నివారణ చర్యగా వేపనూనె (1500 పీపీఎం) లేదా అసిఫేట్ 300 గ్రాములు లేదా ఫ్లునికామైడ్ 50 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.

మొక్కజొన్నలో కత్తెర పురుగులు, ఆకుమాడు తెగుళ్లు కనిపిస్తున్నాయని, వీటి నివారణకు ఎమమెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు, ప్రాపికోనజోల్ 200 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారి చేయాల్సిందిగా సూచించారు. ఆలస్యంగా సాగు చేస్తున్న వరి పంటల్లో కలుపు సమస్య ఎక్కువగా తలెత్తుతుందని, గడ్డి జాతి కలుపు నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ 350 మి.లీ., వెడల్పాటి ఆకుల కలుపు నివారణకు ట్రైఫోమో ఈత్ఆక్సీసల్ఫురాన్ (కౌన్సిల్ ఆక్టివ్) 90 గ్రాములు ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు. పసుపు పంటలో అధిక వర్షాల వలన దుంప కుళ్ళు, దుంప పుచ్చు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన ఆయన, నివారణకు మెటల్ ఆక్సిల్ + మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

దుంప ఈగ నియంత్రణకు కార్బోఫ్యూరాన్ 3 సిజి గుళికలు ఎకరాకు 8–10 కిలోలు ఇసుకలో కలిపి పొలమంతా చల్లాలని, అలాగే పొటాష్ లోపాన్ని అధిగ మించేందుకు 13-0-45 ఎరువు 5 గ్రాములు లీటరుకు కలిపి ఆకులపై పిచికారి చేయాలని వివరించారు. మండల వ్యవసాయ అధికారి పి. హరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఆకుల ద్వారా ఎరువులు అందజేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే పంటలకు లాభం చేకూరుతుందని తెలిపారు. వరి పొలాల్లో కాలిబాటలు వేసుకోవడం ద్వారా గాలి వెలుతురు సులభంగా చేరి చీడపీడల బెడద తగ్గుతుందని, లింగాకర్షణ బుట్టలు, పసుపు కార్డులు వాడుతూ పురుగు ఉధృతి గమనించి అవసరమైనప్పుడు మాత్రమే స్ప్రే చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.రాజ్ కుమార్, డా.ఆర్.విశ్వతేజ, వ్యవసాయ విద్యార్థులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img