కాకతీయ, లక్షెట్టిపేట : బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గాండ్ల సత్యనారాయణను జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కక్షిదారులకు సేవలందించే క్రమంలో బార్ అసోసియేషన్ మార్గదర్శకంగా ఉండాలన్నారు. పెండింగ్ కేసులను వీలైనంత మేరకు న్యాయవాదులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. గత బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కొమిరెడ్డి సత్తన్నకు, గాండ్ల సత్యనారాయణకు సమానంగా ఓట్లు పోల్ కావడంతో నిబంధనల మేరకు ఆరు నెలల చొప్పున పదవీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే సత్యనారాయణ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. బార్ అసోసియేషన్ ఆదర్శంగా ఉండేలా తన వంతు కృషి చేస్తానని సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో ఏపీపీ అజయ్ కుమార్, మాజీ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ఎలక్షన్ కమిషనర్ గోవిందరావు, ఏజీపీ సంతోష్, వైస్ ప్రెసిడెంట్ నలినీకాంత్, జనరల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎన్ సత్య గౌడ్, న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమారెడ్డి, సురేందర్, శ్రీధర్, కిరణ్ కుమార్, రవీందర్, రవికుమార్, పద్మ, రహమతుల్లా, రాజేశ్వర్, సదాశివ్, శివశంకర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.


