సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి
వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డా పి శ్రీజ
కాకతీయ, ఖమ్మం : సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి శ్రీజ తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డా పి శ్రీజ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి సర్వాయి పాపన్న చేసిన సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి నెహ్రూ గౌడ్, బచ్చు విజయ్ కుమార్, నూతి సత్యనారాయణ గౌడ్, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, అమరగాని వెంకన్న, వడ్డెబోయిన నరసింహ గౌడ్, మార్కం లింగయ్య గౌడ్, ఉడుగు శ్రీనివాస గౌడ్, డాక్టర్ శ్రీనివాస గౌడ్, డాక్టర్ రాజశేఖర్ గౌడ్, కోడి లింగయ్య, పగడాల నాగరాజు, షేక్ షకినా, అంబాల వెంకటేశ్వరరావు, తోడేటి దుర్గాప్రసాద్, పెరుగు వెంకటరమణ యాదవ్, జక్కుల వెంకటరమణ, బెల్లం కొండ శరత్, బండి నాగేశ్వరరావు, పెల్లూరి విజయ్ కుమార్, రమణ కుమార్, రవి కుమార్, కొప్పెల్లి శ్రీనివాస్, సమ్మయ్య, బడపట్ల సుదర్శన్, యాదాల నాగేశ్వరరావు, జ్యోత్స్న నాయక్, బత్తిని రాజు, మురళీ కృష్ణ, గంగరాజు, రామకృష్ణ, మాధవి, సతీష్, ముత్యాల రావు, వీరయ్య, మొగలయ్య, చందర్ రావు, రామకృష్ణ, బిసి కుల సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


