అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్
కాకతీయ,చేర్యాల:మండలంలోని ఆకునూరు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఆకునూరు గ్రామ సర్పంచ్ కొమ్ము రవి మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు ఆకునూరు గ్రామంలో సరైన సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,కమ్యూనిటీ హాల్స్, బీటీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అన్ని రంగాల్లో గ్రామం వెనుకబాటుకు గురవుతోందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయం పై సానుకూలంగా స్పందించిన మంత్రి, గ్రామ సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి పల్లవి -భాస్కర్, ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి బోయిని రాజు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల రాజు గౌడ్ తో పాటు తదితరులు ఉన్నారు.


