ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు
కాకతీయ, కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దృష్టి సారించారు. గ్రామాల్లో నిర్వహించిన పెట్రోలింగ్ సందర్భంగా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి సంపత్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం, మానేరు వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తీసుకుని ట్రాక్టర్లో తరలిస్తున్న సమయంలో బొమ్మకల్ గ్రామంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసును కోర్టుకు పంపినట్లు తెలిపారు.


