epaper
Thursday, January 15, 2026
epaper

ఇసుక లోడింగ్ బంద్

ఇసుక లోడింగ్ బంద్
ములుగు జిల్లాలో కాంట్రాక్ట‌ర్ల సిండికేట్‌
ప్ర‌భుత్వం బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు
ఆ మొత్తం లారీ య‌జ‌మానుల నుంచి వ‌సూలు
రూ.3500వేలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం
భ‌ద్రాచ‌లం, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లా కాంట్రాక్ట‌ర్ల వైఖ‌రి
టీజీఎండీసీ అధికారులూ వ‌త్తాసు ప‌లుకుతున్నారంటూ మండిపాటు
టీజీఎండీసీ కార్యాల‌యంలో ర‌హ‌స్యంగా కాంట్రాక్ట‌ర్ల‌తో లారీ య‌జ‌మానుల భేటీ

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా సహా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక లోడింగ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి అని, ప్రభుత్వ బిల్లులు నాలుగు నెలలుగా విడుదల కాలేదనే సాకుతో కాంట్రాక్టర్లు ప్రతి లారీపై అదనంగా లోడింగ్ చార్జీలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తామంటూ బుధవారం ఉదయం నుండే ఇసుక లోడింగ్ నిలిపివేసినట్టు సమాచారం. ములుగులో 3,500,భూపాలపల్లిలో 2,500,భద్రాద్రిలో 2,000 ఇవ్వకపోతే లోడింగ్ జరగదని నిరుపేసినట్టు సమాచారం.

జిల్లాలవారీగా కాంట్రాక్టర్ల డిమాండ్లు ఇలా

ములుగు 3,500, భూపాలపల్లి 2,500, భద్రాద్రి 2,000 చొప్పున అదనపు లోడింగ్ చార్జీ చెల్లించాలని కాంట్రాక్ట‌ర్లు హుకుం జారీ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇందుకు టీజీఎండీసీ అధికారులు కూడా వారికి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లుగా లారీ అసోసియేష‌న్ నాయ‌కులు వెల్లడిస్తుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి సర్కారు నిర్ణయించిన 14,800 ఇసుక డీడీలోనే లోడింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు దీనిని పూర్తిగా పక్కన పెట్టి లారీ యజమానుల వద్ద నుంచి మళ్లీ డబ్బు వసూలు చేస్తుండ‌టం గ‌మనార్హం.

డీడీ కి అదనంగా ఇవ్వాలి..

ప్రతి లారీకి ప్రభుత్వం స్థిరపరిచిన 14,800 డీడీతోపాటు లోడింగ్ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండగా మాలోడింగ్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి అనే కారణాలు చెబుతూ కాంట్రాక్టర్లు లారీ యజమానుల వద్ద నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే లోడింగ్ డబ్బులు కూడా తీసుకొని లారీ యజమానుల నుంచి కూడా లోడింగ్ చార్జీలను వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టీజీఎండీసీ ఆధ్వర్యంలో జరిగిన రహస్య సమావేశం!

భద్రాచలం, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇసుక కాంట్రాక్టర్లు మరియు లారీ ఓనర్లతో రాష్ట్ర టీజీ ఎండీసీ అధికారుల సూచ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం స‌మావేశం కూడా నిర్వ‌హించుకున్నారు. ఈ స‌మావేశంలో కాంట్రాక్ట‌ర్లు లోడింగ్‌కు చార్జీలు విధించాల‌ని డిమాండ్‌ను వినిపించారు. ప్రతి లారీపై రూ. 2వేల నుంచి 3500వర‌కు ఆయా ఏరియాల వారీగా అడుగుతుండ‌టం గ‌మ‌నార్హం.ఈ డబ్బు చెల్లించకపోతే లోడింగ్ నిలిపివేయాలని కాంట్రాక్టర్లు నిర్ణ‌యించుకున్నారు. ఆ ప్ర‌కార‌మే బుధ‌వారం లోడింగ్ నిలిపివేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సర్కారు చెల్లించాల్సిన డబ్బు ను లారీ యజమానులపై కాంట్రాక్టర్లు మోపుతున్నారని లారీ అసోసియేష‌న్లు మండిప‌డుతున్నాయి. ఇసుక ధర 14,800 ఉండగా ఇందులోనే లోడింగ్ చార్జీలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది అని, కాంట్రాక్టర్లు లారీ యజమానుల వద్ద నుండి ఏ విధమైన అదనపు లోడింగ్ చార్జీలు వసూలు చేయరాదు అనే నియమమున ఈ నిబంధనలను పట్టించుకోకుండా అదనపు వసూళ్లు చేయడం వల్ల లారీ యాజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక లోడింగ్ బంద్…..

ములుగు జిల్లాలోని ఇసుక క్వారీలలో బుధవారం ఉదయం నుంచి లోడింగ్ నిలిచిపోయాయని, క్వారీ యాజమానులు లోడింగ్ చార్జీలు నిర్ణయించిన మేరకు చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తామంటూ కాంట్రాక్టర్లు భీష్మించుకు కూర్చున్నారని, లోడింగ్ కోసం వెళ్లిన లారీలు భారీ నిలిచిపోవడంతో చేసేదేమీ లేక కాంట్రాక్టర్కు లోడింగ్ చార్జీలు ఇచ్చి ఇసుకను లోడ్ చేసుకుంటున్నామని లారీల యాజమాన్లు వాపోతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img