హిందూ ఐక్యత కోసం సమ్మేళనం
ఏప్రిల్ 12న హనుమాన్ జంక్షన్లో భారీ సభ
ఆర్ఎస్ఎస్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు వేగం
సమ్మేళనం అధ్యక్షుడు బిల్లా రవి
కాకతీయ, ఖిలావరంగల్ : హిందూ సమాజం ఐక్యంగా నిలబడి సంస్కృతి పరిరక్షణకు కట్టుబడాలని సమ్మేళనం అధ్యక్షుడు బిల్లా రవి పిలుపునిచ్చారు. ఖిలా వరంగల్ తూర్పు కోటలోని హనుమాన్ జంక్షన్ వద్ద ఏప్రిల్ 12న భారీ హిందూ సమ్మేళనం, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఐక్యతపై దృష్టి
తూర్పు కోటలోని కొత్త గడ్డ వద్ద ఆదివారం నిర్వహించిన సమావేశంలో వక్తలు హిందూ సమాజం ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ధర్మ పరిరక్షణ కోసం ఇలాంటి సమ్మేళనాలు కీలకమని పేర్కొన్నారు. యువతలో హిందుత్వ స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. హనుమాన్ స్వామి ఆశీస్సులతో జరగనున్న ఈ కార్యక్రమానికి హిందువులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సమావేశంలో కందిమల్ల మహేష్, వనపర్తి ధర్మరాజు, బోలుగొడ్డు శ్రీనివాస్, చింతం రమేష్, పెసరు కుమారస్వామి, బిల్లా కిషోర్, వాసుదేవు, నాండ్రే అమర్, రంజిత్, అమృత్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


