epaper
Saturday, November 15, 2025
epaper

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

  • కరీంనగర్ లో స్వయంసేవకుల భారీ కవాతు
  • పాల్గొన్న కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు కరీంనగర్ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన వీధుల్లో స్వయంసేవకులు క్రమశిక్షణతో భారీ కవాతు (పథ సంచలన్) నిర్వహించారు. ఈ కవాతులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంసేవకుడిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన రూట్ మార్చ్ కరీంనగర్ పలు ప్రధాన రహదారుల మీదుగా రాంనగర్ వరకు కొనసాగింది. అనంతరం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచలన్ ముగింపు కార్యక్రమం (సమరోప్) జరిగింది.

సభలో ముఖ్య వక్తగా హాజరైన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి అయచితుల లక్ష్మణరావు మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే దాన్ని మత లేదా రాజకీయ కోణంలో కాకుండా, నిస్వార్థ సేవా దృక్పథంతో చూడాలని చెప్పారు. సంఘ్ స్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ దేశంలో ఉన్న సామాజిక విభజన వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని భావించి, జాతిని సంఘటితం చేయాలనే లక్ష్యంతో 1925లో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్‌ను ప్రారంభించారని వివరించారు. దేశ సేవా భావన, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఆచరణ, కుటుంబ ప్రబోధన్, పౌర కర్తవ్యాలపై అవగాహన కలిగించే కార్యక్రమాల ద్వారా సమాజాన్ని మారుస్తున్న సంస్థగా ఆర్ఎస్ఎస్ నిరంతరం పని చేస్తోందన్నారు. ఆఎస్ఎస్ ను విమర్శించాలంటే ముందు దానిలో పనిచేయాలన్న సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆరు నెలలు సంఘంలో పని చేస్తేనే దాని అసలు తత్వం అర్థమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధార్థ స్కూల్స్ అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం కోసం పనిచేస్తున్న స్వయంసేవకులు అభినందనీయులని, దేశానికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కార్యవర్గ సభ్యులు బూర్ల దక్షిణామూర్తి, నగర సంఘ్ చాలక్ హనుమండ్ల శ్రీనివాస్ రెడ్డి, కార్యవాహ చామ మహేశ్వర్, నగరానికి చెందిన వందలాది మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img