epaper
Monday, March 2, 2026
epaper

జన గణనకు రూ.11,718 కోట్లు

జన గణనకు రూ.11,718 కోట్లు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
2026-27లో దేశవ్యాప్తంగా రెండు దశల్లో నిర్వ‌హ‌ణ‌
పూర్తి డిజిటల్ పద్ధతిలో వివ‌రాల సేక‌ర‌ణ‌
వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: 2027 జనాభా లెక్కల నిర్వహణ కోసం ​కేంద్ర కేబినెట్ రూ.11,718 కోట్ల బడ్జెట్​ను ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 2026-27ల్లో దేశవ్యాప్తంగా 2 దశల్లో జనగణన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కానీ ఆనాడు కొవిడ్-19 మహమ్మారి విజృంభించడంతో జనాభా లెక్కల సేకరణను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తదుపరి జనగణన 2027లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. భారతదేశంలో 150 ఏళ్లకు పైగా జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. అందుకు సంబంధించిన రికార్డులు అన్నీ మన వద్ద ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దానికి కొనసాగింపుగా 2027 జనగణన చేయనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ జనగణన భారత్​లో 16వది అవుతుంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత అయితే 8వది అవుతుంది. ఈ జనగణనలో దేశంలోని మొత్తం జనాభా, గృహాలు, సౌకర్యాలు, విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు లాంటి అనేక అంశాల డేటాను సేకరించనున్నారు. వార్డు, గ్రామం, పట్టణం స్థాయిల్లో ఈ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ఆధారంగా ఈ సెన్సెస్​-2027 జరగనుంది.

2 దశల్లో జనగణన

2025 జూన్​ 16న విడుదల చేసిన గెజిట్ ప్రకారం, ఈ జనగణన మొత్తం 2 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ 2026 ఏప్రిల్​- సెప్టెంబర్​ మధ్య జరుగుతుంది. ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని అనుసరించి 30 రోజుల వ్యవధిలో ఇది నిర్వహించబడుతుంది. ఈ దశలో హౌస్ లిస్టింగ్​, హౌస్ సెన్సెస్​ నిర్వహిస్తారు. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ దశలో జనాభా గణన చేస్తారు. అయితే లద్ధాఖ్​, జమ్మూకశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ లాంటి మంచు ప్రాంతాల్లో, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి 2026 సెప్టెంబర్​లో జనాభా లెక్కల సేకరణ చేస్తారు. భారత్​లో మొదటిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో జన గణన చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. మొబైల్ అప్లికేషన్స్​ (ఆండ్రాయిడ్​, ఐఓఎస్​) ద్వారా డేటాను సేకరించి, దానిని మేనేజ్​మెంట్​ అండ్ మానిటరింగ్ సిస్టమ్​పోర్టల్​ ద్వారా రియల్ టైమ్​లో పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వయంగా ఎన్యూమరేషన్ చేసుకోవడం కోసం, హౌస్​లిస్టింగ్ కోసం ప్రత్యేక టూల్స్​ ను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img