epaper
Tuesday, January 27, 2026
epaper

దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు

దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు
చదువుకునే దివ్యాంగులకు ఐప్యాడ్లు, ట్యాబ్స్
రెండేళ్లలోనే దివ్యాంగుల కోసం భారీ వ్యయం
ప్రజా ప్రభుత్వ అండతో దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
మధిరలో ట్రై సైకిళ్ల పంపిణీ

కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక–ప్రణాళిక–ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే సాధించిందని, అందులో భాగంగానే దివ్యాంగుల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టర్ *అనుదీప్ దురిశెట్టి*తో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి అవసరాలను గుర్తించి ప్రభుత్వమే ముందుకొస్తోందని తెలిపారు.

చదువు–సాంకేతికతలో తోడ్పాటు

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, చదువుకుంటున్న దివ్యాంగులకు ఐప్యాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ వంటి ఆధునిక పరికరాలను ప్రజా ప్రభుత్వం అందిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమది ప్రజల గురించి ఆలోచించే ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ అని, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. దివ్యాంగుల గురించి సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, వారు కూడా అన్ని రంగాల్లో రాణించాల్సిందేనని స్పష్టం చేశారు.

మరింత అవకాశాలు ఇవ్వాలి

సమాజంలో ఇతరుల కంటే ఎక్కువ అవకాశాలు, ఆసరా దివ్యాంగులకు కల్పించాలని భట్టి విక్రమార్క సూచించారు. అంగవైకల్యం ఉందన్న బాధ వారికి కలగకుండా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఇదే ఆలోచనతో పాలన సాగిస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఇరిగేషన్ ఎస్ఈ వాసంతి, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస చారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడీ విజయచందర్, మధిర తహసీల్దార్ రాంబాబు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది

టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది అక్రిడిటేషన్ జీవో సవరణపై జర్నలిస్టుల్లో హర్షం డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేష‌న్‌...

అల్లం రవికుమార్ కి నంది అవార్డు

అల్లం రవికుమార్ కి నంది అవార్డు కాకతీయ , కూసుమంచి : కూసుమంచి...

ఎస్‌బీఐటీ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు

ఎస్‌బీఐటీ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు ఏఐ–డిజిటల్ విద్య పైలట్ ప్రాజెక్ట్‌లో విశేష సేవలు 34...

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ నుంచే ప్రవర్తన నియమావళి అమలు చేయాలి పోలింగ్–కౌంటింగ్ వరకూ...

మేడారం జాత‌ర‌కు త‌ర‌లుతున్న భ‌క్తులు

మేడారం జాత‌ర‌కు త‌ర‌లుతున్న భ‌క్తులు కొత్తగూడెం బస్టాండ్‌లో పెరిగిన ర‌ద్దీ 110 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను...

ఎస్‌బీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఎస్‌బీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు కాక‌తీయ‌, ఖ‌మ్మం : ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో...

విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ

విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గణతంత్ర...

జిల్లా కోర్టులో గ‌ణ‌తంత్ర వేడుకలు

జిల్లా కోర్టులో గ‌ణ‌తంత్ర వేడుకలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img