epaper
Saturday, March 14, 2026
epaper

దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు

దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు
చదువుకునే దివ్యాంగులకు ఐప్యాడ్లు, ట్యాబ్స్
రెండేళ్లలోనే దివ్యాంగుల కోసం భారీ వ్యయం
ప్రజా ప్రభుత్వ అండతో దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
మధిరలో ట్రై సైకిళ్ల పంపిణీ

కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక–ప్రణాళిక–ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే సాధించిందని, అందులో భాగంగానే దివ్యాంగుల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టర్ *అనుదీప్ దురిశెట్టి*తో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి అవసరాలను గుర్తించి ప్రభుత్వమే ముందుకొస్తోందని తెలిపారు.

చదువు–సాంకేతికతలో తోడ్పాటు

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, చదువుకుంటున్న దివ్యాంగులకు ఐప్యాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ వంటి ఆధునిక పరికరాలను ప్రజా ప్రభుత్వం అందిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమది ప్రజల గురించి ఆలోచించే ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ అని, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. దివ్యాంగుల గురించి సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, వారు కూడా అన్ని రంగాల్లో రాణించాల్సిందేనని స్పష్టం చేశారు.

మరింత అవకాశాలు ఇవ్వాలి

సమాజంలో ఇతరుల కంటే ఎక్కువ అవకాశాలు, ఆసరా దివ్యాంగులకు కల్పించాలని భట్టి విక్రమార్క సూచించారు. అంగవైకల్యం ఉందన్న బాధ వారికి కలగకుండా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఇదే ఆలోచనతో పాలన సాగిస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఇరిగేషన్ ఎస్ఈ వాసంతి, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస చారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడీ విజయచందర్, మధిర తహసీల్దార్ రాంబాబు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు

ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు డిప్యూటీ వార్డెన్, హెచ్‌ఎం సస్పెన్షన్ కలుషిత ఆహారంతో విద్యార్థినులు...

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img