epaper
Sunday, March 1, 2026
epaper

సినీ కార్మికుల కోసం రూ.10 కోట్లు..

  • ప్రభుత్వం తరపున వెల్ఫేర్‌ ఫండ్ ఏర్పాటు
  • పిల్లల కోసం కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలు
  • హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తా..
  • లాభాల్లో 20 శాతం కార్మికులకు ఇస్తేనే టికెట్ల ధరల పెంపు
  • త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు
  • జూబ్లీహిల్స్‌లో న‌వీన్‌యాద‌వ్‌ను గెలిపించండి
  • సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటా..
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  • యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో సీఎంకు స‌న్మాన స‌భ‌
  • భారీగా త‌ర‌లివ‌చ్చిన సినీ ప్ర‌ముఖులు.. కాంగ్రెస్ శ్రేణులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఫ్యూచర్‌ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలు నిర్మిస్తానని ఉద్ఘాటించారు. సినీ కార్మికుల పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. మంగ‌ళ‌వారం యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డిని సినీ ప్రముఖులు సన్మానించారు. సన్మాన సభకు సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

చౌకగా భూములు కేటాయించారు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఒకప్పుడు తెలుగు పరిశ్రమని మదరాసి అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించాలని.. ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ వంటి వారిని మర్రి చెన్నారెడ్డి సంప్రదించి తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చేందుకు కృషి చేశారని ఉద్ఘాటించారు. చిత్రపురి కాలనీకి ప్రపంచస్థాయి గుర్తింపునకు ఆనాటి నాయకులు కృషి చేశారని తెలిపారు. చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలని తక్కువ ధరకే స్టూడియోలకు భూములు ఇచ్చామని నొక్కిచెప్పారు. రామానాయుడు, పద్మాలయా, అన్నపూర్ణ స్టూడియోలకు అప్పటి సీఎంలు చౌకగా భూములు కేటాయించారని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

సినీ కార్మికుల శ్రమ, కష్టం నాకు తెలుసు..

‘కళాకారులను గౌరవించాలని 1964లో నంది అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులకు కావాల్సింది డబ్బు కాదు.. జనం కొట్టే చపట్లు.. కప్పే దుప్పట్లు. సినీ కార్మికుల శ్రమ, కష్టం నాకు తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్లు అవార్డులు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక గద్దర్‌ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చాం. హైదరాబాద్‌ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనేది నా సంకల్పం. హైదరాబాద్‌ నగరం ఐటీ, ఫార్మా పరిశ్రమలకి వేదిక ఎలాగో.. ఫిల్మ్‌ ఇండస్ట్రీ కూడా అంతే. మీరు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తా’ అని సీఎం రేవంత్‌‌రెడ్డి ఉద్ఘాటించారు.

వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు..

‘హాలీవుడ్‌ సినిమాలు రామోజీ ఫిల్మ్‌సిటీలో, హైదరాబాద్‌లో.. షూటింగ్‌లు జరిగేలా బాధ్యత తీసుకుంటాం. సినీ కార్మికుల కోసం మా ప్రభుత్వం తరఫున చేయగలిగిన పనులు చేస్తాం. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నాం. సినీ కార్మికుల వెల్ఫేర్‌ ఫండ్‌లో మా ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు డిపాజిట్‌ చేస్తాం. సినిమా టికెట్లు పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. కార్మికులకు లాభాల్లో 20 శాతం ఇస్తేనే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవో ఇస్తాం. సినీ కార్మికుల భవన్‌ నిర్మాణానికి స్థలం ఇస్తాం. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. సినీ కార్మికుల అసోసియేషన్‌తో మాట్లాడి స్థలాలు ఇస్తాం. ఫైటర్స్‌, సినీ కార్మికుల ప్రాక్టీస్‌కు ప్యూచర్‌ సిటీలో ఏర్పాట్లు చేస్తాం. సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. నవంబర్‌ చివరి వారంలో సినీ కార్మికులతో మాట్లాడతాం’ అని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img