epaper
Thursday, January 15, 2026
epaper

అధికారులకు రాజభోగాలు… అర్చకులకు అర్థాకలి

అధికారులకు రాజభోగాలు… అర్చకులకు అర్థాకలి
అర్చకులకు ‘ఒకే శాఖ–ఒకే వేతనం’ న్యాయం చేయాలి
జీవో–121 రద్దు చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్తింపజేయాలి
రాష్ట్ర అర్చ‌క జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ
జీవో–577 అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
నూతన దేవాదాయ చట్టం తేవాలని డిమాండ్
వరంగల్ ఉమ్మడి జిల్లా సదస్సులో గళమెత్తిన అర్చక జేఏసీ

కాకతీయ, కాజీపేట : దేవాలయ వ్యవస్థకు మూలస్తంభాలైన అర్చక ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ‘ఒకే శాఖ–ఒకే వేతన విధానం’ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక ఉద్యోగుల సదస్సు పాతర్లపాడు నరేష్ శర్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ విశిష్ట అతిథిగా, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సదస్సులో జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ.. 2017లో ప్రభుత్వం జారీ చేసిన జీవో–577 ప్రకారం 686 దేవాలయాల్లో పనిచేస్తున్న 5,625 మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందాల్సి ఉందన్నారు. కానీ నేటికీ కేవలం 3,327 మందికే వేతనాలు అందుతున్నాయని, మిగిలిన 2,223 మందిని దేవాదాయ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు. జీవో–121ను అడ్డం పెట్టుకుని 1,500 మందికి పైగా అర్చకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆ జీవోను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

అధికారులకు రాజభోగాలు… అర్చకులకు అర్థాకలి

జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ మాట్లాడుతూ దేవాదాయ శాఖలో నెలకొన్న అసమానతలను తీవ్రంగా ఎండగట్టారు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీసం రూ.1,500 వేతనం కూడా అందని దుస్థితి ఉందన్నారు. అదే ఆదాయం నుంచి 12 శాతం ఈఏఎఫ్ ద్వారా అధికారులు మాత్రం ట్రెజరీ జీతాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులతో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది అర్చకులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదవ షెడ్యూల్ ప్రకారం నూతన దేవాదాయ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నేతలు స్పష్టం చేశారు. అధికారులకే కాదు, హిందూ ధర్మ పరిరక్షకులైన అర్చకుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని చట్ట సవరణ జరగాలని, ‘ఒకే శాఖ–ఒకే వేతనం’ సూత్రాన్ని చట్టబద్ధం చేయాలని వరంగల్ వేదికగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గట్టు శ్రీనివాసాచార్యులు, రవీంద్రాచార్యులు, వెల్ఫేర్ బోర్డు సభ్యులు కృష్ణమాచారి, శ్రావణ కుమారాచారి, నారాయణస్వామి, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ఉపాధ్యక్షులు టక్కరి సత్యం, టీఎన్జీవోస్ నాయకులు ఆకుల రాజేందర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img