రోడ్డు పనులు పూర్తి చేయాలి
కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ సముద్రం కట్టపై రహదారి పనులను వెంటనే చేపట్టాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండీ అబ్దుల్ రషీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కొండ సముద్రాన్ని మినీ ట్యాంక్గా అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తూ కొండ సముద్రం కట్ట పైభాగంలో ఉన్న ప్రధాన రహదారిని తొలగించి, ఇప్పటి వరకు మరమ్మత్తులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, ప్రణాళికా లోపాలు, నిర్లక్ష్య ధోరణి కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. ఫలితంగా అభివృద్ధి పేరుతో తొలగించిన రహదారి ఇప్పటివరకు పునర్నిర్మించకపోవడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రహదారి గుండా కొత్త తండా, కౌసల్ బోర్డు తండా, బోడ తండా ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.


